ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయ్ హెల్త్ స్కీం యొక్క వైద్య సేవలను గురువారం నుంచి యాజమాన్యాలు నిలిపివేయనున్నాయి. బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్భాటాల కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్న సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం బకాయిలను చెల్లించడం లేదు.
దీనిపై యాజమాన్యాల సంఘం తరఫున ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఏ ఆసుపత్రికి ఆ ఆసుపత్రి స్వచ్ఛందంగా సేవలు నిలిపేయాలని నిర్ణయించాయి. పెండింగ్ బిల్లులు భారీగా పెరగడం, వివిధ వైద్య ప్యాకేజీల ధరలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాలనుకున్నవారికి , ఉద్యోగులకు అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. సేవల నిలిపివేతకు సంబంధించి ఆసుపత్రుల ఎదుట బోర్డులు ఏర్పాటుచేస్తామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల పైన బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులందక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది, నిర్వహణ కష్టమవుతోందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 25నుంచే సేవలు నిలిపేస్తామని గతంలో ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. అప్పట్లో దీనిపై యాజమాన్యాలతో చర్చించిన ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెచ్చి సేవలు కొనసాగించేలా చేసింది. ఈ చర్చలు ముగిసి నెల గడిచినా బిల్లుల చెల్లింపులో పురోగతి లేదు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి