ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్గా... టైమింగ్స్ మారాయి!
వరంగల్ ఎంజీఎం (Warangal MGM) ఆసుపత్రిలో ఒకరి మృతదేహాన్ని మరొకరి కుటుంబానికి అప్పగించిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన వ్యక్తి బతికే ఉన్నాడని తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కుటుంబ సభ్యుడిని బంధువులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి(50) బతుకుదెరువు కోసం ముంబై వెళ్లాడు. అక్కడే రమ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. అయితే, విభేదాల కారణంగా 20 ఏళ్ల కిందటే కుమారస్వామి, రమ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రమ మైలారంలో ఉంటుండగా, కుమారస్వామి తొర్రూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తొర్రూరులోని బజాజ్ షోరూం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని స్థానికులు 108 సాయంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని కుమారస్వామిగా భావించిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని కుమారస్వామి బంధువులు స్వగ్రామానికి తరలించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మృతదేహం చేతికి పచ్చబొట్టు లేకపోవడం గమనించిన కుటుంబ సభ్యులు.. డెడ్ బాడీ (Dead body) కుమారస్వామిది కాదని గుర్తించారు. దీంతో మృతదేహాన్ని తిరిగి ఎంజీఎంకు తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోని వార్డులో చికిత్స పొందుతున్న కుమారస్వామిని ఆయన బంధువులు గుర్తుపట్టారు. చనిపోయాడనుకున్న కుమారస్వామి బతికే ఉన్నాడని తేలడంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Amaravati Express Highway: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!
Employment News: ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వం శుభవార్త! కేబినెట్ సబ్ కమిటీ పలు మార్లు!
Godavari River: గంట గంటకు పెరుగుతున్న గోదావరి... లోతట్టు ప్రాంతాల ప్రజలుకు హెచ్చరిక!
Visa: అమెరికా వీసా దరఖాస్తుదారులకు షాక్... అదనపు ఫీ ఎంత అంటే!
Substations: ఆ జిల్లాకు మూడు కొత్త సబ్ స్టేషన్లు మంజూరు! ఎస్ఈ శ్రవణ్ కుమార్ ప్రకటన!
Job offers: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీర్లకు గ్లోబల్ అవకాశాలు! శిక్షణతో పాటు ఉద్యోగం!
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Hero Prabhas: ఫస్ట్ టైం కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్! కారణం తెలిస్తే అవాక్కవుతారు!
Donald Trump: ట్రంప్ కొత్త బిల్లు ఎఫెక్ట్..! భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: