గురుగ్రామ్ భూకుంభకోణం కేసులో వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2008లో జరిగిన ఈ కేసులో వాద్రాకు గరిష్ఠంగా 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
అక్రమంగా సంపాదించిన రూ. 38.69 కోట్ల విలువైన 43 ఆస్తులను జప్తు చేయాలని కూడా ఈడీ కోర్టును అభ్యర్థించింది. కేసు విచారణను ఆగస్టు 28కు వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు, వాద్రాకు నోటీసులు జారీ చేసింది.
ఈడీ ఆరోపణల ప్రకారం, భూమి అమ్మకాల సమయంలో తప్పుడు పత్రాలు సృష్టించడంతో పాటు, విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చూపారని, దాంతో హర్యానా ప్రభుత్వానికి రూ. 44 లక్షల స్టాంప్ డ్యూటీ నష్టం కలిగిందని పేర్కొంది.
అసలు భూమి విలువ రూ. 7.50 కోట్లకంటే ఎక్కువైనా, తక్కువగా చూపి రాబర్ట్ వాద్రా రూ. 58 కోట్ల అక్రమ లాభం పొందారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చినదని ఈడీ పేర్కొంది. ఈ లావాదేవీలు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ల్లో జరిగాయని కూడా వెల్లడించింది.
కోర్టును, పీఎంఎల్ఏ సెక్షన్ 4 కింద గరిష్ఠ శిక్షతో పాటు, ఐపీసీ సెక్షన్ 423 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది.