రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. రైలు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా వేసవిని దృష్టిలో పెట్టుకొని మరొక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
ఇప్పటికే వేసవిలో ప్రజల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విశాఖ తిరుపతి, భువనేశ్వర్ యశ్వంతపూర్ మధ్య నడుస్తున్న రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.
విశాఖ తిరుపతి ప్రత్యేక రైలు పొడిగింపు
విశాఖ తిరుపతి మధ్య నడిచే 08583 రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. దీని గడువును మే 5వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మరోవైపు తిరుగు ప్రయాణంలో 08584 రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. ఈ రైలును జూలై ఒకటవ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపింది.
ఇది కూడా చదవండి: మరో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! ఆ భూముల రేట్లకు హద్దుల్లేవ్!
ఏపీలో ఈ ప్రాంతాలలో రైలు ప్రయాణికులకు శుభవార్త
ఇక ఈ రైలును పొడిగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల ,ఒంగోలు, నెల్లూరు, శ్రీకాళహస్తి రేణిగుంట స్టేషన్ లలో రైల్వే ప్రయాణికులకు లబ్ధి జరుగుతుంది. మొత్తం దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలును పొడిగించడం వల్ల 18 ట్రిప్పులు ఈ రైలు ప్రజలకు సేవలను అందిస్తుంది.
భువనేశ్వర్ యశ్వంతపూర్ ప్రత్యేక రైలు పొడిగింపు
కాగా భువనేశ్వర్ యశ్వంతపూర్ 02811 రైలును కూడా పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలును మే 24వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి శనివారం నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో 02812 రైలు ప్రతి సోమవారం నడవనుంది. ఈ రైలు ప్రతి సోమవారం జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ స్టేషన్ లలో రైలు ప్రయాణికులకు సౌకర్యం
ఈ ప్రత్యేక రైలు పొడిగింపు తో ఖుర్దా రోడ్, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, ఎస్ ఎస్ ఎస్ పి నిలయం, హిందూపురం స్టేషన్లలో రైల్ ప్రయాణికులకు వేసవిలో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రైలు పొడిగింపు నేపథ్యంలో 12 ట్రిప్పులు తిరుగుతుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల రైల్వే ప్రయాణికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: