ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు భారత జట్టు కాంబినేషన్పై చర్చలు ముమ్మరమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుది జట్టులో సంజూ శాంసన్ పాత్ర చాలా ముఖ్యమని, ముఖ్యంగా అతన్ని మూడో స్థానంలో ఆడించడం టీమిండియాకు ఉత్తమ ఎంపిక అవుతుందని సూచించారు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేయడం సరైన కాంబినేషన్ అవుతుందని, వన్డౌన్లో సంజూ శాంసన్ ఉండటం జట్టుకు స్థిరత్వాన్ని ఇస్తుందని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
ఇప్పటివరకు ప్రధానంగా ఓపెనర్గా ఆడిన సంజూ శాంసన్, శుభ్మన్ గిల్ రీఎంట్రీతో తుది జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నాడు. కానీ కైఫ్ ప్రకారం, సంజూ అనుభవం, ఆటతీరు వన్డౌన్లో మరింత ఉపయోగపడుతుంది. ఐపీఎల్లోనూ తరచూ మూడో స్థానంలోనే ఆడుతూ విజయాలు సాధిస్తున్నాడు. అంతేకాక, ఇన్నింగ్స్ను నిర్మించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకునే నైపుణ్యం సంజూకి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
కైఫ్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించాడు. రషీద్ ఖాన్ వంటి మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అనుభవజ్ఞుడైన బ్యాటర్ అవసరం అవుతుందని చెప్పాడు. అలాంటి సందర్భంలో సంజూ శాంసన్ ఫార్మ్లో ఉండటం జట్టుకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన విశ్లేషించాడు. ప్రస్తుతం సంజూ కేరళ ప్రీమియర్ లీగ్లో అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇది కూడా అతనికి టీమిండియాలో వన్డౌన్ స్థానానికి మరింత బలాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
అలాగే తిలక్ వర్మ ప్రతిభను కైఫ్ గుర్తించినా, అతను ఇంకా కొంతకాలం వేచి చూడాలని సూచించాడు. తిలక్ భవిష్యత్తులో వన్డౌన్లో అద్భుతమైన ఎంపిక అవుతాడని, కానీ ప్రస్తుతం సంజూ శాంసన్ అనుభవం జట్టుకు అవసరం అవుతుందని చెప్పాడు. వర్మ ఇప్పటికీ అద్భుత ప్రదర్శనలు చూపుతున్నా, జట్టు నిర్మాణంలో అనుభవం ప్రాధాన్యతను కైఫ్ హైలైట్ చేశాడు.

మొత్తానికి, ఆసియా కప్ 2025తో పాటు వచ్చే ఆరు నెలల్లో జరిగే ప్రపంచకప్ కోసం భారత జట్టును సరిగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని కైఫ్ స్పష్టం చేశాడు. ఈ సందర్భంలో సరైన కాంబినేషన్, ముఖ్యంగా మూడో స్థానంలో సంజూ శాంసన్ లాంటి ఆటగాడు ఉండటం జట్టుకు చాలా కీలకం అవుతుందని చెప్పాడు. ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.