Apple: భారత్‌లో యాపిల్ వేగం! ఐదు ఫ్యాక్టరీలతో భారీ ప్రణాళికలు..!

తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య రైల్వే స్టేషన్లలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. నిత్యం 30కి పైగా రైళ్లు ఆగే ఈ స్టేషన్ రోజుకు సగటున 8 నుండి 9 వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నారు. ప్రయాణికులతో పాటు వస్తు రవాణా కూడా కలిసిపోవడంతో రోజుకు సుమారు రూ.8 లక్షల ఆదాయం రైల్వేశాఖకు ఇక్కడి నుంచే వస్తోంది. ఇంత పెద్ద రద్దీ ఉండే స్టేషన్‌కి మూడో లైను ఏర్పాటు చేశారు. కానీ మూడో లైన్ కారణంగా ఒక పెద్ద సమస్య పుట్టుకొచ్చింది.

Minister Meeting: అల్పపీడనంతో ప్రభుత్వం అలర్ట్.. భారీ వర్షాలపై అన్ని శాఖలకు దిశానిర్దేశం.. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం!

ప్రస్తుతం ప్రయాణికులు రైళ్లను మూడో ప్లాట్ఫాం వైపు నుంచి మాత్రమే ఎక్కే సౌకర్యం ఉంది. రెండో వైపు నుంచి రైలులో ఎక్కే అవకాశం లేకపోవడంతో రద్దీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడో లైన్ మీద రైలు ఆగితే, ప్రయాణికులు వంతెన ఎక్కి ఒక వైపు వెళ్లి అక్కడి నుంచి రైలులో ఎక్కాల్సి వస్తోంది.

Delay tenders: విజయవాడ గుంటూరు రహదారి పనులు ఆలస్యం.. ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకి!

పెద్దవారు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు ఈ పరిస్థితిలో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒకే వైపు నుంచి ఎక్కడం వల్ల రద్దీ పెరిగి, తొక్కిసలాట దృశ్యాలు కూడా కనబడుతున్నాయి.ప్రయాణికులు చెబుతున్నట్లుగా – “రెండు వైపులా ఎక్కే అవకాశం ఉంటే సమస్యే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక్క వైపు మాత్రమే  

Indian markets: టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ప్రారంభమైన భారత మార్కెట్లు!

మహబూబాబాద్ పట్టణం రైల్వే స్టేషన్‌కి ఇరువైపులా విస్తరించింది. పట్టణం రెండో వైపు నుంచి ప్రయాణించే వారు ఎక్కువ. ప్రభుత్వ కార్యాలయాలు, కురవి, సీరోలు, నెల్లికుదురు మండలాల ప్రజలు ఎక్కువగా ఈ దారి నుంచే స్టేషన్‌లోకి వస్తారు. ఈ వైపు టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంది. మూడో లైన్ నిర్మాణానికి ముందు రెండో ప్లాట్ ఫామ్ పైకి నేరుగా వెళ్లే మార్గం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తిరిగి వంతెన ఎక్కాల్సి వస్తోంది. ఇది ప్రయాణికులకు ఒక పెద్ద ఇబ్బంది.

Jan Aushadhi: ఏపీలో ప్రతి మండలంలో ‘జన ఔషధి’ స్టోర్లు..! బీమా, ఉచిత వైద్య పరీక్షలు, మోడల్ ఇంక్లూజివ్ సిటీ..!

ఈ సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం – నాలుగో ప్లాట్ఫాం నిర్మాణం. నాలుగో ప్లాట్ఫాం నిర్మిస్తే పట్టణం రెండో వైపు నుంచి వచ్చిన ప్రజలు నేరుగా రైలులో ఎక్కే సౌకర్యం ఉంటుంది. రద్దీ తగ్గి, ప్రయాణికులు సులభంగా ఎక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు సౌకర్యంగా రాకపోకలు సాగించగలరు. ఇది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, భద్రతా అంశం కూడా. రద్దీ తగ్గితే ప్రమాదాలు జరగకుండా నిరోధించవచ్చు.

Job: యువతకు గుడ్ న్యూస్! ఇన్‌స్టా & యూట్యూబ్ స్క్రోలింగ్ స్కిల్‌తో ఉద్యోగం…!

ప్రయాణికులు మాత్రమే కాదు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్‌ను బలంగా ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. రైల్వే జీఎం, రైల్వే మంత్రికి కూడా ఈ సమస్యను తెలియజేశారు. స్థానిక నేతలు చెబుతున్నారు – “పట్టణం రెండు వైపులా ఉండటంతో ప్లాట్ ఫామ్ కూడా ఇరువైపులా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించగలరు.”

Bypass: విజయవాడకు కొత్త బైపాస్! ఆ రూట్‌లో ఆరు లైన్లుగా.. గంట సమయం ఆదా..!

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన జంక్షన్. ఇక్కడి నుంచి వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ ప్రయాణం చేస్తున్నారు. రైల్వే ఆదాయం కూడా రోజుకో లక్షల్లో వస్తోంది. ఇలాంటి స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సదుపాయాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత. అందుకే ప్రయాణికులు, సంఘాలు, రాజకీయ పార్టీలు ఒకే స్వరంతో చెబుతున్నాయి.

Free Bus: ఏపీలో ఉచిత బస్సులు మరింత సౌకర్యవంతం..! మహిళలకు లైవ్ ట్రాకింగ్ & డ్యువల్ బోర్డులు!
Trump warns: చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌పై ట్రంప్ హెచ్చరిక... 200% టారిఫ్స్ సిద్ధం!
AP Villas LowCost: అమరావతిలో రియల్ ఎస్టేట్ జోరు.. రూ.కోటికే లగ్జరీ విల్లాలు.. హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడే తక్కువ!
DSC: మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్ ప్రారంభం!
National Highway: ఏపీలోని కొత్త నేషనల్ హైవే 6 లైన్లుగా.. ఆ జిల్లాలో భారీ టన్నెల్, బెంగళూరుకు 8 గంటల్లో వెళ్లొచ్చు!
AP Weather: ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు.. 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం! పలు జిల్లాల్లో..