DSC: ఉపాధ్యాయ నియామకాల్లో కీలక దశ..! డీఎస్సీ ఫైనల్ మెరిట్ జాబితా విడుదల!!

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అంశం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల అనేకమంది దివ్యాంగుల పింఛన్లు నిలిపివేయబడటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, అర్హులైన వారందరికీ పింఛన్లు యథావిధిగా అందుతాయని స్పష్టం చేశారు. ఆయన అధికారులతో సమావేశమై పింఛన్ల తొలగింపుపై సమీక్ష నిర్వహించారు. గతంలో అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన వారి పింఛన్లు మాత్రమే రద్దు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

AP liquor case: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కెసిరెడ్డి మరిన్ని ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి!

అధికారులు సీఎంకు నివేదిస్తూ, చాలా మంది పూర్తిగా ఆరోగ్యవంతులుగానే ఉండి తప్పుడు సర్టిఫికెట్లు చూపించి పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. ఈ నకిలీ పింఛన్లను గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించామని వివరించారు. నిజమైన దివ్యాంగులు మాత్రం ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వారి పింఛన్లు నిరంతరం అందించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కొందరికి నోటీసులు పంపినప్పటికీ, అవి కూడా వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Bank Jobs: రూ.85 వేల జీతం తో 750 బ్యాంక్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ఎప్పటినుంచి అంటే!

మంత్రి నారా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, పింఛన్ల విషయంలో సంపూర్ణ పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తొలగించబడిన పింఛనుదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, ఎవరైనా అర్హులు పొరపాటున తొలగించబడితే రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

D-Mart: డిమార్ట్ అభివృద్ధి.. చిన్న దుకాణాల అణచివేత! ఈ రిటైల్ వార్‌లో విజేత ఎవరు? ఇదేం కొత్త పంచాయితీ సామీ!

గత ప్రభుత్వ కాలంలో వేలాది అనర్హులు రాజకీయ కారణాల వల్ల పింఛన్లు పొందారని తెలిపారు. ప్రస్తుతం 1.20 లక్షల పింఛన్లు నిలిపివేయబడ్డాయి. వీటిలో కొందరు టీడీపీ అనుబంధులే అయినప్పటికీ, పార్టీలకతీతంగా అర్హత ఉన్న వారందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అనర్హులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా పింఛన్ల జాబితా నుండి తప్పించబడతారని లోకేష్ స్పష్టం చేశారు.

India Pakistan: భారత్ పాక్ మ్యాచ్.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్!

నిజమైన దివ్యాంగులకు ఎలాంటి అన్యాయం జరగదని, పింఛన్లు వారికి నిరంతరంగా అందుతాయని ప్రభుత్వం మరోసారి భరోసా ఇచ్చింది. నకిలీ పింఛన్లను పూర్తిగా తొలగించి, అర్హులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ ప్రకటించారు.

కువైట్ లో అలా చేస్తే భారీ జరిమానా! పబ్లిక్ ప్లేసెస్ లో అస్సలు చేయకూడదు!
Kuwait insurance policy: కువైట్ భీమా రంగంలో సంచలనం... కొత్త నిబంధనలు! ఇకనుండి అవి తప్పనిసరి! వెంటనే అమల్లోకి!
Upadhi hami: ఉపాధి హామీ శ్రామికులకు శుభవార్త.. ఈ నెల ఖాతాల్లోకి డబ్బులు!
స్విట్జర్లాండ్‌లో ఆస్తులు కొనుగోలు చేసే హక్కు ఇప్పుడు వారికి మాత్రమే!
Warning issued Dhavaleswaram : ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. ప్రభుత్వం సూచనలు!
Online betting: కొత్త బిల్లు.. ఇక ఆన్లైన్ బెట్టింగ్‌కు చెక్!
108 Coin: మీరు ఎప్పుడైనా 108 కాయిన్ చూశారా! దేశంలో ఇదే తొలిసారిగా..!
Police: తెలంగాణ పోలీస్ నియామకాల్లో షాక్:! 59 మంది నకిలీ సర్టిఫికెట్లతో..!