ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈ కార్డుకు రూ.40 దరఖాస్తు రుసుముగా వసూలు చేయగా, ఇప్పుడు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కార్డు లబ్ధిదారులు:
పురుషులకి 60 ఏళ్లు
మహిళలకి 58 ఏళ్లు నిండిన వారు అర్హులు.
ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది.
ఎక్కడ దరఖాస్తు చేయచ్చు?
గ్రామ/వార్డు సచివాలయాలు
మీసేవా కేంద్రాలు
ఇంటర్నెట్ సెంటర్లు
అవగాహన ఉన్నవారు మొబైల్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్లు:
వయసు ధృవీకరణ (ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు)
అడ్రస్ ప్రూఫ్
ఫోటో
బ్లడ్ గ్రూప్
ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు
బ్యాంక్ అకౌంట్ వివరాలు
ప్రధాన ప్రయోజనాలు:
RTC బస్సుల్లో 25% టికెట్ రాయితీ
ప్రతి బస్సులో రెండు సీట్లు రిజర్వ్
రైల్వేలో ప్రత్యేక కౌంటర్లు, వీల్ఛైర్ సదుపాయం, లోయర్ బెర్త్ ప్రాధాన్యత
పాస్పోర్టు ఫీజులో 10% తగ్గింపు
కోర్టుల్లో కేసుల విచారణకు ప్రత్యేకత
బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ లైన్లు, సేవల్లో ప్రాధాన్యం
ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ రేటు (60-79 ఏళ్ల వారికి 0.5%, 80 పైబడినవారికి 1%)
ఆదాయ పన్ను మినహాయింపులు
ఈ కార్డుతో వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక సేవలు మరింత సులభతరం కానున్నాయి.