ఈ ఏడాది వర్షాలతో వరుణ దేవుడు ఆంధ్రప్రదేశ్ లో ముంచెత్తుతున్నాడని చెప్పుకోవాలి. ఏడాది వేసవిలో కూడా భారీ వర్షాలు కురిసాయి అందువల్ల మామిడి పంట రైతులు బాగానే నష్టాలను చవిచూశారు. విజయవాడలో సైతం భారీ వరదలను ఎదుర్కొన్న పరిస్థితులు తెలిసినవే.
అయితే మరల బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాబోయే బుధవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ముందుగానే సమాచారం తెలుపుతుంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ముఖ్యంగా బుధవారం, గురువారం రోజులలో తీరానికి దగ్గరగా ఉన్న జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుందని లోటెత్తు ప్రాంతాలను ప్రాంతాలలో నీరు నిల్వ ఉండే సూచన ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ముఖ్యంగా ఈ జిల్లాలలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఎక్కువగా ప్రభావితమవుతాయని చెప్పారు. అలాగే రాయలసీమలోని నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటు తీర ఆంధ్రలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
రైతులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వరి, పత్తి, కూరగాయల పంటలకు వర్షం, నీరు నిల్వల వల్ల నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.వర్షాల సమయంలో వాగులు, చెరువులు, కాల్వల దగ్గరికి వెళ్లరాదని APSDMA హెచ్చరించింది.అత్యవసర పరిస్థితుల్లో 1070 లేదా 1800-425-0109 నంబర్లకు సంప్రదించాలని ప్రజలకు తెలపడం జరిగినది.