Amaravathi :అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసుల నిర్మాణానికి.. త్వరలో శంకుస్థాపన!

దేశవ్యాప్తంగా పరిశోధన, బోధనా రంగాలలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు శుభవార్త. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సీఎస్‌ఐఆర్‌ – యూజీసీ నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) డిసెంబర్‌ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతీ ఏడాది ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుండగా, ఈసారి డిసెంబర్‌ సెషన్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలు చేయాలనుకునే వారికి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) లభించనుండగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలకు అర్హత కల్పిస్తారు. అలాగే పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఈ పరీక్ష ద్వారానే అవకాశం దక్కనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 29, 2025 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Maruti Suzuki: పెట్రోల్-డీజిల్ గుడ్‌బై! మారుతి సుజుకి 2026లో 4 హైబ్రిడ్ కార్లు!

ఈసారి పరీక్షను మొత్తం 6 సబ్జెక్టుల్లో నిర్వహించనున్నారు. కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫియరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ అనే ఆరు విభాగాల్లో పేపర్లు ఉంటాయి. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కనీసం మాస్టర్స్‌ డిగ్రీలో 55% మార్కులు సాధించి ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 50% మార్కులు సరిపోతాయి. వయోపరిమితి విషయానికి వస్తే, జేఆర్‌ఎఫ్‌ కోసం దరఖాస్తు చేసే జనరల్‌ అభ్యర్థులు డిసెంబర్‌ 2025 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు 5 ఏళ్ల వరకు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. అయితే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మరియు పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి ఉండదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

Diwali Gift: మహిళలకు దీపావళి కానుక! డైరెక్ట్ మీ అకౌంట్ లో డబ్బులు! ఎంతంటే!

దరఖాస్తు ప్రక్రియలో ఫీజు వివరాలు కూడా ఎన్‌టీఏ ప్రకటించింది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1150 చెల్లించాలి. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ మరియు ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.325 ఫీజు చెల్లించాలి. పరీక్ష విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉండి, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో 200 మార్కులకు జరుగుతుంది. మొత్తం 3 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమయానికి పూర్తి చేయాలని ఎన్‌టీఏ సూచించింది.

డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం! ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు! దరఖాస్తు.. పూర్తి వివరాలు!

ముఖ్యమైన తేదీలు కూడా ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్‌ 24, 2025గా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అక్టోబర్‌ 25, 2025. దరఖాస్తులో మార్పులు చేసుకోవడానికి అక్టోబర్‌ 27 నుంచి 29 వరకు అవకాశం కల్పించారు. చివరగా, రాత పరీక్షను డిసెంబర్‌ 18, 2025న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో విజయం సాధించడం ద్వారా అభ్యర్థులు పరిశోధన, బోధన రంగాల్లో తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాలు పొందగలరని నిపుణులు చెబుతున్నారు.

Speed Post: తపాలా శాఖ సంచలన నిర్ణయం..! దాదాపు 13 ఏళ్ల తర్వాత స్పీడ్ పోస్ట్ చార్జీల సవరణ..!
సింగపూర్‌లో పవిత్ర చండీ హోమ మహోత్సవం! 30 సంవత్సరాల సంప్రదాయం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు!
Praja Vedika: నేడు (29/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ప్రేమగా దగ్గర తీసుకుని గోరుముద్దలు పెడుతున్న సుమిత్ర ఆనందంలో దీప!!!
Road Development: త్వరలో ప్రారంభం కానున్న హైవే విస్తరణ పనులు! ఆ రూట్లో ఆరు లైన్లుగా... కొత్తగా ఫ్లైఓవర్లు.. అండర్‌పాస్‌లు!
Bomb Hoax: ఒకే రోజు 300 స్కూళ్లు, పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్! భయాందోళలో విద్యార్థులు.. ప్రజలు!