ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అందులో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్ పర్సన్ మరియు కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్లు నియమితులయ్యారు.
శ్రీ బుచ్చి రాంప్రసాద్…
బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీ బుచ్చి రాంప్రసాద్ న్యూయార్క్ రాష్ట్రంలో ఫార్మా రంగంలో బిజినెస్ చేసుకుంటూ అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి కూడా దగ్గరి వ్యక్తి. ఏ విషయమైనా సూటిగా మాట్లాడే శ్రీ బుచ్చిరామ్ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ విధి విధానాలు, శ్రీ చంద్రబాబు, శ్రీ లోకేష్ ల నాయకత్వ పటిమకు ఆకర్షితులై, అమెరికా వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియాశీల రాజకీయాలలో గత 10 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.
ఆయనకు APNRT చీఫ్ కోఆర్డినేటర్, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, NRI టీడీపీ సెల్ కోఆర్డినేటర్, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ గా విశిష్ట అనుభవం ఉంది.
బ్రహ్మం చౌదరి…
మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పీజీ వరకు చదువుకున్నారు. విద్యార్థి దశ నుంచే తెదేపా వైపు ఆకర్షితులయ్యారు. తెలుగు నాడు విద్యార్థి విభాగం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లోనే అధిష్ఠానం దృష్టిలో పడటంతో ఆయనను ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 2014 నుంచి 2021 వరకు విద్యార్థుల సమస్యలపై పోరాడారు. రాష్ట్ర విభజన జరిగాక తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితుల య్యారు. దాదాపు 35 నియో జకవర్గాలకు పరిశీలకులుగా పనిచేశారు.వైకాపా నేతలకు ఎదురు తిరిగి.. వైకాపా అధికారంలోకి వచ్చాక బ్రహ్మం చౌదరిపై 24 అక్రమ కేసులు పెట్టారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా, ఎక్కడా తగ్గకుండా వైకాపాకు ఎదురొడ్డి పనిచేశారు.
ఈ రెండు పదవులకు నియమితులైన ఇరువురికి ఆంధ్రప్రవాసి తరఫున ప్రత్యేకంగా చప్పిడి రాజశేఖర్ తరఫున హార్దిక శుభాకాంక్షలు