నేషనల్ హైవే NH 365B అలైన్మెంట్ మార్పు చేయాలనే రైతుల డిమాండ్కు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు సానుకూలంగా స్పందించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, రైతుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర అధికారులను కలిశారు. రాజీవ్ రహదారి, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేసే కొత్త అలైన్మెంట్ను పరిశీలించాలని ప్రతిపాదించగా, అధికారులు పాత భూసర్వే నిలిపివేసి కొత్త మార్గంపై పరిశీలనకు అంగీకరించారు. దీంతో భూములు కోల్పోతున్న రైతులకు ఊరట లభించింది.
సూర్యాపేట నుండి సిద్దిపేట మీదుగా సిరిసిల్లకు వెళ్లే 365బీ జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చడానికి నేషనల్ హైవే అథారటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. రైతుల భూములను కాపాడేందుకు కొత్త మార్గాన్ని పరిశీలించడానికి వారు సానుకూలంగా స్పందించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు రైతుల ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లి జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమా శంకర్ను కలిశారు. రైతులు నష్టపోకుండా రాజీవ్ రహదారి, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన అధికారులు పాత మార్గానికి సంబంధించిన భూసర్వేను నిలిపివేసి, కొత్త మార్గాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ మార్పుతో రైతులు తమ భూములు కోల్పోకుండా ఊరట చెందనున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు! మెగా ప్రాజెక్టులకు శ్రీకారం!
కాగా, సూర్యాపేట నుండి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల నిర్మించే 365బీ జాతీయ రహదారి మెుత్తం పొడవు సుమారు 184 కిలోమీటర్లు. సూర్యాపేట, అరవపల్లి, ఫణిగిరి, తిరుమలగిరి, జనగాం, దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా దీనిని నిర్మించనున్నారు. జనగాం నుండి దుద్దెడ వరకు: ఈ 45.57 కిమీ విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.438 కోట్లు మంజూరు చేసింది. దుద్దెడ నుండి సిరిసిల్ల వరకు 54 కిమీ పొడవును రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ 1 కింద దుద్దెడ నుండి మల్యాల వరకు (27 కిమీ), ప్యాకేజీ 2 కింద మల్యాల నుంచి సిరిసిల్ల వరకు (27 కిమీ) నిర్మించనున్నారు. ఈ విస్తరణ పనులకు రూ.1100 కోట్ల వ్యయం అంచనా వేయబడింది.
సూర్యాపేట వద్ద NH 65, అరవపల్లి, వంగమర్తి సమీపంలో NH 365, జనగాం వద్ద NH 163, సిరిసిల్ల వద్ద తెలంగాణ రాష్ట్ర రహదారి 11ల వద్ద ప్రధాన జంక్షన్లు నిర్మించనున్నారు. అయితే దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు హైవే విస్తరణ కోసం భూ సేకరణపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారు పచ్చని పంట పొలాలను కోల్పోతామని, సరైన పరిహారం అందడం లేదని పేర్కొంటున్నారు. అలైన్మెంట్ మార్పు, హైవే వెడల్పు తగ్గింపు వంటి డిమాండ్లతో వారు నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఎంపీ రఘనందన్ రావు నేతృత్వంలోని రైతుల బృందం కేంద్ర అధికారులను కలవగా.. అలైన్మెంట్ మార్పుపై వారు సానుకూలంగా స్పందించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: