ఏపీలో మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు! మెగా ప్రాజెక్టులకు శ్రీకారం! మూడు రాష్ట్రాలలో...
Wed Apr 30, 2025 16:56 Politics
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) రెండు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. మే 1, 2 తేదీల్లో మహారాష్ట్ర (Maharashtra), కేరళ (Kerala), ఆంధ్రప్రదేశ్లలో (Andhrapradesh) ప్రధాని పర్యటించనున్నారు. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను పీఎం ప్రారంభిస్తారు. దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రుల భాగస్వామ్యంతో గ్లోబల్ మీడియా డైలాగ్ సదస్సు జరుగనుంది. అలాగే కేరళలోని విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో 58,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. ఏపీ బహుళ రోడ్డు , రైలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. అక్కడ నిర్వహించే బహరింగ సభలో ప్రధాని మోదీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: ఆటో స్క్రాప్తో మోదీ విగ్రహం.. సభకు ప్రత్యేక ఆకర్షణగా! శిల్పాలకు ప్రశంసల జల్లు!
ఏపీలో ప్రధాని పర్యటన వివరాలు
మే 2న ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. రాజధాని అమరావతిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు పీఎం శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ.
డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్హెచ్ఐ, రైల్వేస్కు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని.
నాగాయలంకలో దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
వైజాగ్లో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్కు శంకుస్థాపన
రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజక్టుకు శంకుస్థాపన
ఇవి కాకుండా... రూ. 3176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చ్యువల్ పద్ధతిలో శంకుస్థాపనలు
అలాగే రూ.3680 కోట్ల విలవైన పలు నేషనల్ హైవే పనులను ప్రారంభించనున్నారు మోదీ
రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట - విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, కేయీఎఫ్ పాణ్యం లైన్లను ప్రధాని ప్రారంభించనున్నారు.
మొత్తం రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు ప్రధాని మోదీ.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #PMModiVisit #MegaProjects #AndhraPradeshDevelopment #ModiInAP #InfrastructureBoost #ModiTour
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.