ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైసెన్సు ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఆయా హోటళ్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్రీస్టార్ హోటల్స్ మరియు ఆ పై స్థాయి హోటల్స్లోని బార్ల లైసెన్స్ మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోటళ్లలోని బార్లకు సంబంధించి వార్షిక లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి రూ.66.55 లక్షలు ఉండగా, వాటిని రూ.25 లక్షలకు తగ్గించింది. గత ప్రభుత్వం 2022లో తీసుకున్న బార్ల నిబంధనల్లో త్రీస్టార్, ఆ పైస్థాయి బార్లకు వార్షిక లైసెన్సు ఫీజు రూ.5 లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
అంతేకాకుండా, ఈ ఫీజులు ఏటా పది శాతం పెరుగుతాయని అప్పట్లో పేర్కొంది. దీనితో ఇప్పుడు రెండు కలిపి మొత్తం ఫీజు రూ.66.55 లక్షలకు చేరింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైసెన్సు మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం స్పందిస్తూ, ఏడాదికి లైసెన్సు ఫీజు రూ.5 లక్షలు, నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ.20 లక్షలుగా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఏటా పది శాతం ఫీజు పెంపును కూడా తొలగించింది. పర్యాటకంతో పాటు ఆతిథ్య రంగానికి ప్రోత్సాహం అందించేందుకు లైసెన్సు ఫీజులను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తగ్గించిన ఫీజులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!
మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..
ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర గుడ్న్యూస్.. ఆ నిధుల విడుదల!
వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!
ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!
దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!
టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!
సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!
మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..
సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!
వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: