ముంబయి నటి కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించిన కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు మూడో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు విజయవాడ జీజీహెచ్ వైద్యపరీక్షలు నిర్వహించారు. సీఐడీ ఏఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో అంజనేయులను విచారిస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు ఆరు గంటలపాటు సీఐడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. 80కి పైగా ప్రశ్నలు అడిగారు. వాటిలో ఏ ఒక్కదానికీ పీఎస్ఆర్ ఆంజనేయులు సూటిగా సమాధానం చెప్పలేదు. అన్నింటికీ దాటవేత ధోరణిలో, తప్పించుకునే రీతిలో జవాబులిచ్చారు. దర్యాప్తు అధికారులు వారి వద్దనున్న ఆధారాల్ని చూపించి ప్రశ్నించటంతో వాటికి సంబంధం లేని విధంగా సమాధానాలిచ్చారు. సీఐడీ అధికారులు మధ్యాహ్నం భోజనం పెట్టినా పీఎస్ఆర్ తినలేదు. 'మీరిచ్చిన ఆహారం తినను. నాకు అవసరం లేదు' అని చెప్పారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించి అధికారులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: