దర్శి పట్టణంలోని గడియారస్తంభం కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఈ స్తంభం నిర్మించారు. నిర్మాణం సమయంలో ఆర్అండ్బీ అధికారులు ముందుచూపు లేకుండా ఒకవైపు నిర్మించారు. దీంతో ఆ సర్కిల్లో పెద్ద వాహనాలు తిరిగేందుకు వీలులేకుండా ఇబ్బందిపడే పరిస్ధితి నెలకొంది. కాలక్రమంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరగటంతో అక్కడ తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి: శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!
ఈనేపథ్యంలో ట్రాఫిక్కు అడ్డుగా ఉన్న గడియారస్తంభం తొలగించాలని రెవెన్యూ, నగర పంచాయతీ అధికారుల నిర్ణయించారు. గడియార స్తంభం కూల్చవద్దని రోటరీ క్లబ్కు చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. అయితే, ట్రాఫిక్కు అడ్డుగా ఉన్నందున తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని నగర పంచాయతీ అధికారులు కోర్టుకు వివరణ ఇవ్వటంతో అడ్డంకులు తొలగిపోయినట్లు కమిషనర్ మహేశ్వరరావు తెలిపారు. ఈక్రమంలో గడియార స్తంభాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: