Removal dogs: ఢిల్లీలో వీధి కుక్కల తరలింపు.. పెరుగుతున్న వివాదం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లపై సరిచూసిన తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారికి పింఛన్లు రద్దు చేసి నోటీసులు జారీ చేసింది. అయితే, దివ్యాంగుల పింఛను రద్దు అయినా, వితంతువుల పింఛనును కొనసాగించాలని కొన్ని అధికారులు సూచించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు.

గోకుల నందనుడి లీలలు! శ్రీకృష్ణాష్టమి విశేషాలు! పాటించవలసిన నియమాలు!

ప్రభుత్వ తనిఖీలో అనర్హులుగా తేలిన వారిలో వితంతువులు ఉన్నారని గుర్తించారు. వీరందరికి వితంతు పింఛనుకు అర్హత ఉందని, ఆ కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని క్షేత్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే గుర్తించిన అనర్హులలో వృద్ధాప్య పింఛనుకు అర్హులైన వారిని ఆ కేటగిరీలోకి మార్చారు. మిగిలిన వారిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. అర్హులైన వారికి పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Handicrafts: ఏటికొప్పాక హస్తకళల్లో జాతీయ గౌరవం..! జెండా, రాఫెల్‌తో మెప్పించిన కళాకారుడు!

ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో వైద్యుల ధృవీకరణలో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పింఛన్ రద్దు చేస్తారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న, కానీ తీవ్రమైన అనారోగ్యం లేని వారికి రూ.15 వేల పింఛను తీసుకుంటున్న వారి పింఛను రూ.6 వేలకు తగ్గించబడుతుంది. అలాగే 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారు వృద్ధుల కేటగిరీలోకి వస్తే వారికి రూ.4 వేల పింఛను ఇవ్వబడుతుంది. కొత్త సదరం ధ్రువీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా అందిస్తారు.

Dwacra Mahilalu: డ్వాక్రా మహిళలకు నెలకు రూ.40 వేల ఆదాయం! ఎలాగంటే?

వైకల్య శాతంపై ఏవైనా సందేహాలు ఉంటే, అర్హులు అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ ప్రక్రియలో Government General Hospital (GGH), RIMS, District Hospital, Area Hospital ద్వారా మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత అప్పీల్ లెటర్, మెడికల్ సర్టిఫికేట్, సంబంధిత సపోర్టింగ్ డాక్యుమెంట్లతో MPDO లేదా Municipal Commissioner వద్ద సమర్పించాలి. సదరం సర్టిఫికేట్/నోటీస్ అందిన 30 రోజులలోపు అప్పీల్ సమర్పించాలి.

New industrial policy: యువత భవిష్యత్తు కోసం కొత్త పరిశ్రమల విధానం.. బిహార్ CM!

అందువల్ల, ఇప్పటికే పింఛన్లు రద్దైన వారికి మరొక అవకాశం ఇవ్వబడుతుంది. ఆగస్టు 15 నుండి “మన మిత్ర” యాప్ ద్వారా కొత్త ఫిర్యాదులు చేసుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా పింఛన్ దరఖాస్తుదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించవచ్చు. కొత్త పింఛన్ దరఖాస్తులో పత్రాలు, అర్హత లేదా రికార్డులో లోపాల కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

Fancy Number: తెలంగాణ వాహనదారులకు షాక్..! ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెంపు!
Glass Bridge: అమరావతిలో మరో మైలురాయి..! 47 అంతస్తుల సీఎంవో టవర్, గ్లాస్ బ్రిడ్జితో ఐదు టవర్ల..!
Government Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 9 సంవత్సరాల తర్వాత ఆ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
TTD: టీటీడీ ఉద్యోగులకు తీపికబురు! నెరవేరబోతున్న ఎన్నో ఏళ్ల కల.. కీలక నిర్ణయం!
Praja Vedika: నేడు (16/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!