అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా సచివాలయ ఐకానిక్ టవర్ల పనులు ఊపందుకున్నాయి. లండన్కు చెందిన ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్ ప్రకారం ఐదు భారీ టవర్లు నిర్మిస్తున్నారు. ఇందులో 47 అంతస్తులతో జీఏడీ టవర్లో ముఖ్యమంత్రి కార్యాలయం, మరో నాలుగు 39 అంతస్తుల హెచ్వోడీ టవర్లు ఉంటాయి.
తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు టవర్లను కలుపుతూ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మించనుంది. మూడో అంతస్తు వద్ద ఉండే ఈ వంతెనలో ఎయిర్కండిషనింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. దీంతో ఒక టవర్ నుంచి మరొకటికి మంత్రులు, అధికారులు, ప్రజలు సులభంగా వెళ్లగలిగేలా అవుతుంది.
ఈ టవర్ల నిర్మాణంలో డయాగ్రిడ్ పద్ధతిను అనుసరిస్తున్నారు. ఒక్కో టవర్కి 15-20 వేల టన్నుల ఉక్కు అవసరం అవుతుంది. రవాణా ఖర్చు తగ్గించి, పనులు వేగవంతం చేయడానికి టెండర్లు గెలుచుకున్న సంస్థలు అమరావతిలోనే వర్క్షాపులు ఏర్పాటు చేసేందుకు CRDA అనుమతి కోరాయి.
గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు ఆలస్యమై, సంవత్సరాల పాటు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు నేల బలం పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడంతో నిర్మాణం మళ్లీ వేగం అందుకుంది. ఐకానిక్ టవర్లతో పాటు 8 ఎమినిటీస్ బ్లాక్లు కూడా మూడు అంతస్తులతో నిర్మించనున్నారు.