తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇతర దేశాల్లోనూ అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాల ఆధ్వర్యంలో మినీ మహానాడు, ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్లోనూ ఈ నెల 24, 25 తేదీల్లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమాల నిర్వహణకు అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో భాగంగా ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ విభాగం అధ్యక్షుడు పవన్ కుర్రా నిన్న ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో కలిసి మినీ మహానాడు పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గౌతు శిరీష, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరవుతారని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి, మినీ మహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి, శివ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!
ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్కు బాంబు బెదిరింపులు..
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: