ప్రతి రోజు రైలు ప్రయాణంలో వేల కొలది వలస కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. అదేవిధంగా సాధారణ ప్రయాణికులు తమ గమ్యానికి కొనసాగుతున్నప్పుడు చాలామంది ట్రైన్ నుంచి దిగి వాటర్ పట్టుకోవడం కాస్త కష్టతరం అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రయాణికుల దగ్గరికి వాటర్ బాటిళ్లు విక్రయించే వారు, రైల్వే ప్లాట్ఫారమ్ల వద్ద వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటుందని ప్రతి ప్రయాణికుడికీ తెలుసు.
ప్రస్తుత కాలంలో రైల్వేలో కూడా వాటర్ బాటిల్ ధరలు పెరుగుతూ, ప్రయాణికులను భయభ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రయాణికులను ఉద్దేశించి రైల్వే ప్రభుత్వం వాటర్ బాటిల్ ధరను తగ్గిస్తున్నట్లు అధికార ప్రకటన చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.
రైళ్లలో లభించే వాటర్ బాటిల్ ధరలను తగ్గించారు. ఈ ధర తగ్గింపు కొత్త జీఎస్టీ రేట్లను అనుసరించి, ప్రజలకు తాగునీరు సులభంగా అందుబాటులో ఉండేలా తీసుకొచ్చిన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త ధరల వివరాలనుబట్టి, గతంలో ఒక లీటర్ నీటి బాటిల్ 15 రూపాయలు కంటే కొద్దిగా ఎక్కువ ధరతో లభించేది. కానీ ఇప్పుడు అదే బాటిల్ కేవలం 14 రూపాయలకు లభిస్తుంది. అలాగే, 500 మిల్లీలీటర్ బాటిల్ ధర గతంలో 10 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు 9 రూపాయలకే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కొత్త ధరలు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) మరియు ఇతర బ్రాండ్ల బాటిళ్లపై కూడా వర్తిస్తాయి.
మొత్తానికి, రైల్వే ప్రయాణికుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది. అదేవిధంగా తాగునీరు సులభంగా, చౌకగా అందడం వల్ల ప్రయాణికులు సంతృప్తి పొందవచ్చు. ముఖ్యంగా పొడవైన రైల్ ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.