Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో కలిపే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టుకు కీలక మైలురాయి చేరింది. ఈ ప్రాజెక్టు సుమారు 230-250 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ టెండర్లు పిలవనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)లోని ఒక ఎగ్జిట్ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి, మునుగోడు, మిర్యాలగూడ వంటి వెనుకబడిన ప్రాంతాల మీదుగా అమరావతికి చేరనుంది.

AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!

ఈ ఎక్స్‌ప్రెస్ వే నాలుగు వరుసలుగా నిర్మించబడుతుంది. దీనికి సర్వీస్ రోడ్లు ఉండవు మరియు చాలా తక్కువ ఎగ్జిట్ పాయింట్లు మాత్రమే ఉంటాయి. నిర్మాణ ఖర్చు రూ.8,800 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం, రెండు రాష్ట్రాల NHAI ప్రాంతీయ కార్యాలయాలకు బాధ్యతలు అప్పగించనుంది. ప్రాథమికంగా కన్సల్టెన్సీ రిపోర్ట్ ఆధారంగా తుది అలైన్‌మెంట్‌ను నిర్ణయించి, పూర్తి స్థాయి DPR సిద్ధం చేయనున్నారు.

USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..

ఈ ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును రీజినల్ రింగ్ రోడ్డుతో కలిపే మరో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ భారం తగ్గించడంతో పాటు, పారిశ్రామిక మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మార్గం వేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!
Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!
Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!
Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!
P4 initiative: బంగారు కుటుంబాలు.. పీ-4 కార్యక్రమంతో కొత్త ఆశలు! చంద్రబాబు కీలక ప్రకటన - అలా అస్సలు చేయొద్దు!
Praja Vedika: నేడు (6/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!