ఈ సవంత్సరం నేషనల్ శాసనసభ్యులు కాన్ఫరెన్స్ అమెరికా లో ని బోస్టన్ నగరం లో జరుగుతుంది, ఆముదాలవలస ఎమ్మెల్యే, ఇంజనీర్ కూన రవి కుమార్ బోస్టన్ కు వచ్చారు, భారతదేశం నుంచి 165ప్రజాప్రతినిధుల వచ్చిన ఈ సభ కి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు నుంచి ఆముదాల వలస ఎమ్మెల్యే రవి కుమార్ ఒక్కరే విచ్చేసారు.
ఈ సందర్భంగా ఆముదాల వలస ఎమ్మెల్యే రవి కుమార్ బోస్టన్ లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.NRI టీడీపీ బోస్టన్ మహానగరంలో 2022 మహానాడు ను దిగ్విజయముగా జరిపిన ఎన్ఆర్ఐ టీడీపీ న్యూ ఇంగ్లాండ్ పసుపుదళంని కలుసున్నారు.
ఈ సమావేశం లో ముందుగా అంకినీడు ప్రసాద్ తెలుగు తమ్ములుని ఆహ్వానించారు, సూర్య తేలప్రోలు మాట్లాడుతూ గత ఎన్నికలల్లో లక్షల్లో దొంగ ఓట్లను ఎలా తీసివేసింది సభికులు అందరకి పూసగుచ్చినట్టు విశదీకరించారు, శ్రీ బోళ్ల S4 మీడియా అధినేత చంద్ర బాబు గారి ప్రభుత్వము చేస్తున్న అభివృద్ధిని, పారదర్శకంగా చేస్తున్నతీరుని కొనియాడారు సభలో పలువురు తెలుగు తమ్ములు ఉత్సాహముగా ప్రసంగించారు .
ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో లోకేష్ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతుంది అన్నారు. శ్రీకాకుళం లో ఎన్ఆర్ఐ లు ఇండస్ట్రీస్ కారిడార్ కు దోహద పడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ ఉద్దేశము అని చెప్పారు, తెలుగు తమ్ములు అందరు ఇప్పటవరుకు చేసిన కృషిని మెచ్చుకొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో భాగముగా తమవంతు కృషి చేయాలి అని వచించారు. చివరగా వేణు కునమనేని వచ్చిన తెలుగు తమ్ములందరికి కృతజ్ఞతలు తెలిపారు.
చక్కటి విందు తోటి ముగిసిన ఈ సమావేశానికి సంపత్ కట్ట, విజయ్ బెజవాడ, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కృష్ణ ప్రసాద్ సోంపల్లి తదితరులు పాల్గొన్నారు.