ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తోంది. రేపటి నుంచి ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల లబ్దిదారుల పరిశీలన కోసం ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించింది. ఇందులో నకిలీ కార్డుల ఏరివేత చేపట్టింది. అలాగే కొత్త కార్డుల కోసం లబ్దిదారులపై అంచనాలు తయారు చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. దీని గడువును సైతం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించబోతోంది. స్దానిక సచివాలయాల్లో అధికారులు ఈ మేరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటారు. అనంతరం వాటి పరిశీలన ఉంటుంది. లబ్దిదారుల పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆ లోపు ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ కొత్త కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో లబ్దిదారులకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సూచనలు చేశారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు కావాల్సిన వారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే అనర్హులు ఉంటే తమ కార్డుల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కూడా మంత్రి సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: