Free Bikes: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ఉచితంగా బైకులు... దరఖాస్తు వివరాలు!

రైలు ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నార్త్ సెంట్రల్ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లలోని అన్ని ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్య ద్వారా ఆకతాయిల ఆగడాలు, దొంగతనాలు, చట్టవిరుద్ధ చర్యలను అరికట్టడమే కాకుండా, ప్రయాణికులు భద్రతతో ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది.

Gold Silver: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 1,782 కోచ్లలో సీసీటీవీ కెమెరాలు అమర్చనున్నారు. వీటిలో 895 లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లు, 887 ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కోచ్లు ఉంటాయి. ముఖ్యంగా ప్రయాగ్జ్ ఎక్స్ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ఆధునిక AI ఆధారిత కెమెరాలను కూడా అమర్చాలని అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా రైల్లో జరిగే అనుమానాస్పద కదలికలను ఆటోమేటిక్‌గా గుర్తించి రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది.

Shobhita Dhulipala: శోభిత దూళిపాళ్ల మెసేజ్ చూశారా! పెళ్లయిన సంవత్సరంలోనే ఇది అన్నమాట సంగతి!

మొదటి దశలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ప్రెస్, కాళింది ఎక్స్ప్రెస్, అంబేద్కర్ నగర్ ఎక్స్ప్రెస్, లాలఘర్ ఎక్స్ప్రెస్, సంగమ్ ఎక్స్ప్రెస్, డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్, మీరట్ సిటీ ఎక్స్ప్రెస్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా జమ్మూ మెయిల్ వంటి అనేక రైళ్లలో ఈ సీసీటీవీ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Sarvepalli Radhakrishnans : ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం!

ప్రతి ఏసీ కోచ్‌లో నాలుగు కెమెరాలు అమర్చబడతాయి. జనరల్ కంపార్ట్మెంట్లు, స్లీపర్ కోచ్లు, ప్యాంట్రీ కార్లలో ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. కెమెరాలను ప్రవేశ ద్వారాల వద్ద, కారిడార్లలో అమర్చడం ద్వారా కోచ్‌లోని ప్రతి కదలికను పర్యవేక్షించవచ్చు. ఈ వీడియోలు నేరుగా NCR ప్రధాన కార్యాలయం, అలాగే ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలకు చేరతాయి. అదనంగా, లోకోమోటివ్ క్యాబిన్లలో కూడా నిఘా పరికరాలు అమర్చేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి.

Forest Department: ఏనుగుల దాడులకు చెక్..! ఆధునిక టెక్నాలజీతో అటవీ శాఖ సరికొత్త వ్యూహం!
Flight suffers: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఊపిరి బిగబట్టిన క్షణాలు!
Water Cut: హైదరాబాద్ వాసులకు అలేర్ట్..! 48 గంటల నీటి సరఫరా నిలిపివేత!
Vande Bharat: వందే భారత్‌లో అదనంగా 4 బోగీలు..! భక్తులకు మరింత సౌకర్యంగా!
Doctors warning: మండుతున్న ఎండలు.. వైద్యుల హెచ్చరిక – చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తప్పనిసరి!
Praja Vedika: నేడు (6/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!