భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశవ్యాప్తంగా తన 4జీ సేవలను ప్రారంభించింది. శనివారం (సెప్టెంబర్ 27, 2025)న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారికంగా ఈ నెట్వర్క్ను ప్రారంభించారు.దీని వల్ల ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పథకాలు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి అవకాశాలు మరింత సులభంగా చేరతాయని అధికారులు తెలిపారు
బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం ఇప్పటికే కొన్ని కొత్త రీఛార్జ్ ప్లాన్లు కూడా తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వీటిలో ఎక్కువ కాలం చెల్లుబాటు, తక్కువ ధరతో మరొక కొత్త ప్లాను చేర్చడం జరిగినది అది అంతా అంటే రూ. 997 ప్లాన్. ఈ ప్లాన్ దీని వల్ల ఉపయోగాలు అంటే తెలుసుకుందాం
ఈ ప్లాన్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 160 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంటే దాదాపు 5 నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా సిమ్ యాక్టివ్గా ఉంటుంది. తరచుగా రీఛార్జ్ చేయలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఈ ప్లాన్తో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. స్థానిక, STD, రోమింగ్ కాల్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ వంటి సర్కిల్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రోజుకు *100 ఉచిత SMSలు కూడా ఇవ్వబడతాయి. ఈ ఫెసిలిటీ మొత్తం 160 రోజుల పాటు కొనసాగుతుంది.
ఇంటర్నెట్ వాడకానికి ఈ ప్లాన్లో రోజుకు 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అయితే 2GB ముగిసిన తర్వాత స్పీడ్ 40 Kbpsకి తగ్గిపోతుంది. కానీ ఈ తక్కువ స్పీడ్తో కూడా ప్రాథమిక బ్రౌజింగ్, మెసేజింగ్ యాప్లు సులభంగా ఉపయోగించుకోవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే, బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రారంభం వల్ల ఇప్పుడు నగరాలతో పాటు గ్రామాలకూ వేగవంతమైన నెట్వర్క్ చేరనుంది. రూ. 997 ప్లాన్ వినియోగదారులకు ఎక్కువ కాలం, తక్కువ ఖర్చుతో మంచి ఆఫర్గా మారనుంది అనే చెప్పవచ్చు.