Chandrababu Speech: మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం – సీఎం కీలక ప్రకటనలు! వారికి ఎంత ఇచ్చినా తక్కువే..

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంగా వరుసగా నాలుగు రోజులుగా రాజకీయ ఉద్రిక్తతలు ఊపందుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై పోలీసులు నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

ZPTC: పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు.. వైసీపీ, టీడీపీ వర్గీయులపై వరుస కేసులు!

గత బుధవారం నల్లగొండవారిపల్లె గ్రామంలో ఈ రెండు పార్టీలకు చెందిన వర్గాలు ఢీకొన్నాయి. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ధనుంజయ అనే కార్యకర్తను కుల ప్రస్తావన చేస్తూ దాడి చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రి సహా 50 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయింది.

Samantha Comments: అతని కోసమే ఒప్పుకున్నా..I Love You.. మొత్తానికి ఓపెన్ అయిన సమంత! ఆ సమయంలో తనను..

అదే గ్రామంలో మరో కేసు కూడా నమోదైంది. వైసీపీ నాయకుడు రామలింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు జయభారత్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి సహా 16 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

World News: అక్కడ ఇల్లు కొంటే.. 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్! ఆఫర్‌పై ప్రపంచం ఉత్సాహం!

ఇక అదే రోజు ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినట్టు ఎంఫీడీవో కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, ఇతర 150 మందిపై కేసు నమోదైంది.

Indore Madhya Pradesh: పాల క్యాన్‌ను హెల్మెట్‌లా పెట్టుకున్న రైడర్‌… పెట్రోల్ బంక్ సీజ్!

ఇక టీడీపీలోకి చేరిన విశ్వనాథ్ రెడ్డిని ఫోన్‌లో బెదిరించినట్టు ఆరోపణలపై వైసీపీ నేతలు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ పీఏ రాఘవరెడ్డి, తుమ్మలపల్లి గంగాధర్ రెడ్డిలపై మరో కేసు నమోదు అయింది.

Modi Reacts: అమెరికా టారిఫ్ దాడి.. భారత్‌ ఎవరికీ తలవంచదు.. ట్రంప్ కి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!
Secunderabad: అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు! ఎందుకంటే?
Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!
Asim Munir: రెండు నెలల్లో రెండోసారి..! మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్!
Wayside Amenities: హైవేల పక్కన ఎమినిటీ సెంటర్లు.. ప్రయాణికుల కోసం కేంద్రం కొత్త ప్రణాళిక!