TTD Updates: నడక మార్గాల్లో చిరుతల భయం లేకుండా... తిరుమల అడవుల్లో కొత్త టెక్నాలజీ!
TTD: తిరుమల నడక మార్గాల్లో భక్తుల రక్షణ కోసం టీటీడీ 'రోబోట్ డాగ్' అనే అత్యాధునిక సాంకేతికతను పరిశీలిస్తోంది. థర్మల్ కెమెరాలు, ఏఐ ఆధారంగా పనిచేసే ఈ రోబోట్లు చీకట్లోనూ చిరుతలు, ఇతర అడవి జంతువుల కదలికలను గుర్తించి, భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేస్తాయి.
- చీకట్లోనూ అడవి జంతువులను పసిగట్టే టీటీడీ రోబోట్ డాగ్తి
- రోబోట్ డాగ్ పనితీరును పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో
- భక్తులకు పూర్తి భద్రత: తిరుమలలో నాలుగు కాళ్ల రోబోల ట్రయల్స్
Tirumala: తిరుమల నడక మార్గాల్లో భక్తుల రక్షణ కోసం మరియు అడవి జంతువుల కదలికలను కనిపెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా నాలుగు కాళ్ల "రోబోట్ డాగ్" (Robot Dog) అనే సరికొత్త టెక్నాలజీని వాడాలని చూస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులు క్షేమంగా నడిచేలా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ రోబోట్ ఎలా పనిచేస్తుందో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద స్వయంగా పరిశీలించారు. మనుషులు వెళ్లడానికి వీలుకాని దట్టమైన అటవీ ప్రాంతాల్లో, ప్రమాదకరమైన కొండ ప్రాంతాల్లో ఈ రోబోట్ సులభంగా తిరుగుతూ నిఘా పెట్టగలదు.
ఈ రోబోట్ డాగ్లో ఆధునిక కెమెరాలు, రాత్రిపూట కూడా జంతువులను గుర్తించే థర్మల్ కెమెరాలు, 360 డిగ్రీల సెన్సార్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉన్నాయి. వీటి ద్వారా కటిక చీకటిలో, పొగమంచు లేదా వర్షంలోనైనా వన్యప్రాణుల జాడను ఇది ఇట్టే కనిపెట్టగలదు.
ఈ రోబోట్లోని ఏఐ సిస్టమ్ మనుషులను, వాహనాలను మరియు చిరుతలు, ఎలుగుబంట్ల వంటి అడవి జంతువులను వేర్వేరుగా గుర్తించగలదు. అడవి జంతువులు నడక మార్గాల వైపు రావడం గమనిస్తే, వెంటనే లైవ్ వీడియోను మరియు లొకేషన్ వివరాలను కంట్రోల్ రూమ్కు పంపి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
అడవి జంతువులు దారి వైపు వచ్చినప్పుడు, రోబోట్లోని లైట్లు మరియు శబ్దాలను ఉపయోగించి వాటిని భయపెట్టి తిరిగి అడవిలోకి పంపే వీలుంటుంది. ఇది భక్తులకు, జంతువులకు ఎటువంటి హాని కలగకుండా చూస్తుంది. ఇప్పటికే ఉన్న అటవీ సిబ్బంది పెట్రోలింగ్కు ఇది మరింత తోడ్పాటును అందిస్తుంది.
Be the first to react