Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం!
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శన క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.
శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. శిలాతోరణం వరకు భక్తుల బారులు..
తిరుమలలో భక్తుల సందడి.. ఒక్కరోజే 95 వేల మందికి పైగా దర్శనం..
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శన క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.
ఉచిత సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు సుమారు 20 నుంచి 22 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 8 గంటలలోపు దర్శనం లభించే అవకాశం ఉందని తెలిపారు.
ఇక స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా భారీగా నమోదైంది. నిన్న మొత్తం 95,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
హుండీ ఆదాయం ద్వారా స్వామివారికి నిన్న రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. మొత్తం 4.66 లక్షల లడ్డూలు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు.
అన్నప్రసాద సేవలో భాగంగా నిన్న 3.23 లక్షల మంది భక్తులు భోజన సదుపాయం పొందారు. తిరుమలలో ఏర్పాటు చేసిన వైద్య సేవలను 4,112 మంది భక్తులు వినియోగించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Be the first to react