ప్రపంచంలో పలు దేశాలు ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్య వైపు చూస్తున్నాయి. దాదాపు 5 శతాబ్ధాల తరువాత అయోధ్యలో రాముడి మందిరం కొలువుతీరనుంది. నేడు (జనవరి 22న) రాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా బాల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు పలు చోట్ల లైవ్ చూసే ఏర్పాట్లు చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మల్టీప్లెక్స్ లు సైతం రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రదర్శించనుంది. దేశంలో ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది. అయోధ్యలో రామయ్య కొలువుదీరే క్షణం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి చోట ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.
చరిత్రలో నిలిచిపోయే అపూర్వ ఘట్టం హిందువుల ఐక్యతను చాటిచెప్పేలా ఉండాలని పలువురు హిందూ ధర్మ సభ్యులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసారు..
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి