ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) వెళ్లే భక్తులకు అటవీ శాఖ కీలక సూచనలు చేసింది. నల్లమల అటవీ ప్రాంతంలో 2026 (Tiger Census 2026) సంవత్సరానికి సంబంధించిన అఖిల భారత పులుల గణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం తెలియకుండా యాత్రకు బయల్దేరితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే భక్తులు ముందుగా ఈ ఆంక్షలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో పులుల గణన ప్రక్రియ కొనసాగుతోంది. నాగార్జునసాగర్–శ్రీశైలం (Nallamala Forest)
టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్–3 కెమెరా ట్రాప్ల ద్వారా పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈ గణన ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం అటవీ రేంజ్లలో ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో అడవుల్లో మనుషుల కదలికలు తగ్గించాల్సిన అవసరం ఉండటంతో పాదయాత్రపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వెంకటాపురం–హటకేశ్వరం, పెచ్చెరువు–నాగలూటి మార్గాల్లో శ్రీశైలం పాదయాత్రను ఫిబ్రవరి 8 వరకు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్గాలు నల్లమల అడవుల గుండా వెళ్లడం వల్ల పులుల గణనకు ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని (Forest Department)అధికారులు తెలిపారు. ఈ కాలంలో భక్తులు ఆత్మకూరు–దోర్నాల రోడ్డు మార్గాన్ని ఉపయోగించి శ్రీశైలానికి చేరుకోవాలని సూచించారు.
భక్తులకు ఊరటనిచ్చే వార్త ఏమిటంటే (Srisailam Temple) మహాశివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్రకు అనుమతి ఇస్తామని అటవీ శాఖ ప్రకటించింది. ఈ రోజుల్లో భక్తుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అఖిల భారత పులుల గణన కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యేందుకు భక్తులు సహకరించాలని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావ్ కోరారు.
శ్రీశైలం పాదయాత్రకు మహాశివరాత్రి (Maha Shivaratri) సమయంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు నల్లమల అడవుల గుండా సుమారు 48 నుంచి 50 కిలోమీటర్లు నడుచుకుంటూ స్వామిని దర్శించుకుంటారు. వెంకటాపురం ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో నాగలూటి, దమర్లకొంట, పెచ్చెరువు, భీముని కోల వంటి ప్రదేశాల్లో భక్తుల కోసం ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అటవీ శాఖ ఆంక్షలు అమలు చేస్తోంది. కాబట్టి (Andhra Pradesh News) శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తులు అధికారుల సూచనలు పాటించి, నిబంధనలను గౌరవిస్తూ యాత్రను సురక్షితంగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Devotees Alert: భక్తులకు అలర్ట్ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..!