Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి వాట్సాప్, టెలిగ్రామ్

Published : 2025-11-29 18:33:00
Pakistan Border: పాక్‌ సరిహద్దులో భారతీయుడు అరెస్ట్! 100 రోజుల తర్వాత వెలుగులోకి..!


దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లను వాడాలంటే తప్పనిసరిగా సిమ్ కార్డు ఫోన్‌లో అమర్చివుండాలి. ఇప్పటి వరకు వినియోగదారులు ఒక ఫోన్‌లో సిమ్ ఉంచి, ఆ సిమ్‌కి వచ్చే ఓటీపీతో వేరే ఫోన్‌లో కూడా యాప్‌ను ఉపయోగించగలిగారు. ఈ లోపాన్ని సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఫలితంగా 'టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు – 2025'ని విడుదల చేసి, ఇకపై సిమ్ బైండింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

ఈ కొత్త నిబంధనల ప్రకారం, సోషల్ మీడియా యాప్‌లు ఇకపై సిమ్ లేకుండా లాగిన్ లేదా యాక్సెస్‌ను అనుమతించకూడదు. టెలికమ్యూనికేషన్ విభాగం వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్ వంటి కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. కొన్ని యాప్‌లు వినియోగదారు ఫోన్‌లో సిమ్ లేకున్నా పనిచేసే సౌకర్యాన్ని ఇస్తుండటం వల్ల సైబర్ మోసగాళ్లకు ఇది ఒక పెద్ద ఆయుధంలా మారింది. ఎక్కడో దూర ప్రాంతంలో కూర్చొని ఇతరుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలు చేయడం ఎక్కువైంది. బ్యాంక్‌లు, యూపీఐ అప్లికేషన్లు ఇప్పటికే సిమ్ బైండింగ్ విధానాన్ని అనుసరిస్తున్నందున, సోషల్ మీడియా యాప్‌లూ అదే మార్గాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది!

ఇప్పటి వరకూ యాప్‌ను ఒకసారి వెరిఫై చేసి లాగిన్ అయ్యాక సిమ్ కార్డు ఫోన్ నుండి తీసివేసినా, యాప్‌లో లాగిన్ కొనసాగేది. ఈ విండోను ఉపయోగించి నేరగాళ్లు ఇతరుల వేరిఫికేషన్‌ తీసుకుని తమ ఫోన్లలో ఖాతాలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, లింకుల ద్వారా ప్రజలను మోసం చేసే కేసులు భారీగా పెరిగాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులుగా నటిస్తూ డబ్బులు కాజేయడం, నకిలీ ఉద్యోగాలు చూపించడం, విదేశీ పెట్టుబడుల పేరుతో మోసాలు చేయడం వంటి ఘటనలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసి ఉండటం వల్ల యాప్‌ అకౌంట్లు అసలు వినియోగదారుని ఫోన్‌కే పరిమితం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో సైబర్ నేరాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సిమ్ బైండింగ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సిమ్‌కు ఒకే ఫోన్‌లో మాత్రమే యాప్ యాక్సెస్ పరిమితం అవుతుంది. దీంతో నకిలీ లాగిన్లు, అనామక ఖాతాలు, ఫేక్ ఐడెంటిటీలకు అడ్డుకట్ట పడనుంది. సోషల్ మీడియా ఖాతాల్లో జరిగే అనేక స్కామ్‌లు, అకౌంట్ దొంగతనాలు, ఫేక్ OTP ట్రిక్స్ కూడా తగ్గుతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం ముఖ్యమైన మలుపుగా మారనుంది.
 

IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!
Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!
Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!
Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!
Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!
క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!

Spotlight

Read More →