Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

Ditva Cyclone: ఏపీపై దిత్వా పంజా… వచ్చే 48 గంటలు కీలకం! ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం నాటికి మరింత బలపడుతూ, ఆదివారం తెల్లవారుజామ

Published : 2025-11-29 16:58:00
Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది!


దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం నాటికి మరింత బలపడుతూ, ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అత్యవసర పరిస్థితులప్పుడు మాత్రమే బయటకు రావాలని, వీలైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

తుఫాను ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కారైకాల్‌కు 150 కి.మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకి 350 కి.మీ దూరంలో దిత్వా కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వేగం, దిశ కొనసాగితే ఆదివారం తెల్లవారుజామున తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు కూడా పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు.

IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!!

దిత్వా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తుఫాను తీవ్రత, దాని ప్రభావం, ముందస్తు చర్యలపై విపులంగా చర్చించారు. తుఫాను మార్గం, వర్షాలు, గాలివేగం వంటి వివరాలను రియల్‌టైమ్‌లో విశ్లేషిస్తూ ప్రభావిత జిల్లాలకు వెంటనే హెచ్చరికలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న పరిస్థితులను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

Farmers: రైతులకు గుడ్‌న్యూస్.. ఆ భూములు కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం! రుసుములన్నీ మాఫీ!

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లోని బలహీన ప్రాంతాలను గుర్తించి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. వర్షాలు అధికంగా పడే జిల్లాల్లో విద్యుత్, రోడ్లు, కమ్యూనికేషన్ వంటి అత్యవసర సేవలను అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో పని చేస్తున్నట్లు మంత్రి అనిత హామీ ఇచ్చారు.
 

Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే!
Cold winds: చలిగాలులు విస్తరించనున్నాయి.. తెలంగాణలో 30 వరకు ఉష్ణోగ్రతల పతనం!
Highways Project: హైవేల వెంట సౌర ప్యానెల్‌లు… కాలుష్య నియంత్రణకు కేంద్రం కొత్త పైలట్‌ ప్రాజెక్ట్ ప్రారంభం!!
క్లాసిక్ బ్రాండ్ మళ్లీ దూకుడు.. సింగిల్ ఛార్జ్‎తో 153కిమీ రేంజ్.. ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్!
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి అవకాశం!
TTD: పరకామణి కేసులో ఆస్తుల బదిలీలో కుట్ర..! వెనుక ఆ నలుగురు నేతలేనా?

Spotlight

Read More →