Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్!

Traffic Rules: శాంతిభద్రతలపై రాజీ లేదు…! పోలీసుల పనితీరుపై సీఎం క్లియర్ కట్ ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో పోలీస్ శాఖకు

Published : 2025-12-19 09:12:00
AP Government: ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం! అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు!


ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో పోలీస్ శాఖకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా అసంబద్ధమైన ట్రాఫిక్ చలానాలు విధించొద్దని ఆదేశించారు. చట్టం అమలవ్వాలి కానీ అది ప్రజలకు భారం కావద్దన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన సీఎం, సమీక్షలు కేవలం మొక్కుబడికే కాదని, ఫలితాలు కనిపించాల్సిందేనని హెచ్చరించారు. తప్పు చేసినవారిలో పోలీసులంటే భయం ఉండాలే తప్ప, చట్టబద్ధంగా నడిచే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.

Green Tea: ఖాళీ కడుపులో గ్రీన్ టీ తాగితే ప్రమాదమేనా? తెలుసుకోండి..

రాష్ట్రంలో రౌడీజం, మహిళలపై నేరాలు పూర్తిగా అంతమవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. “రౌడీలు అనే పదమే రాష్ట్రంలో ఉండకూడదు” అంటూ నోటోరియస్ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని సూచించారు. జిల్లాల వారీగా ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని, లొంగని వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను మరింత విస్తృతంగా అందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 22.5 శాతం తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.

AP Tourism: కేరళ తరహాలో జలవిహారం.. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే యోచన!

ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్‌లపై కూడా పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఫోరెన్సిక్ వ్యవస్థను ఆల్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. తీరప్రాంత భద్రత కోసం తక్షణమే బోట్ల కొనుగోలు జరగాలని, డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ద్వారా 15 నిమిషాల్లో బాధితుల వద్దకు పోలీసులు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదంపై సమీక్ష జరిపి, బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని స్పష్టం చేశారు.

International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం!

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ అకౌంట్ల ద్వారా వ్యక్తిత్వ హననం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ అంశంపై మంత్రుల కమిటీతో అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు కీలకమని పేర్కొన్నారు. నేరాలపై అలక్ష్యం వహిస్తే ప్రభుత్వానికే నష్టం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ, ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించే నేరాలపై ఎస్పీలు, కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో నమ్మకం కోల్పోతామని హెచ్చరించారు.
 

SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం!
అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక!
భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్!
AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!
ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్!

Spotlight

Read More →