ప్రత్యేక విమానంలో కడపకు షర్మిల
ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించిన షర్మిల
నేడు విజయవాడలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించనున్న షర్మిల
అమరావతి : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లారు. ఆమెతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డిలు కూడా పయనమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వీరు ప్రత్యేక విమానంలో కడపకు వెళ్లారు. విమానాశ్రయం నుంచి వీరు రోడ్డు మార్గంలో పయనించి ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ కు చేరుకున్నారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
తండ్రి సమాధి వద్ద షర్మిల నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల... APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటున్న సందర్భంగా YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది. నాన్నకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానం. అందుకే ఆయన ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను. నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం. అందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను.
చివరి వరకు YSR సిద్ధాంతాల కోసం నిలబడతా. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యూలరిజం, ఫ్లూరలిజం అనే పదాలకు అర్ధం, రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొల్పి దేశానికీ మంచి జరగాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అని అన్నారు. రాత్రి ఇడుపులపాయలోనే బస చేసారు. నేడు విజయవాడకు చేరుకుని, ఏపీసీసీ చీఫ్ గా ఆమె బాధ్యతలను స్వీకరిస్తారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి