దాదాపు మూడేళ్ల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ మంగళవారం ఆమోదించడం చర్చనీయాంశమైంది.
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021, ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని అప్పట్లో స్వయంగా వెళ్లి స్పీకర్ ను కలిశారు.
అప్పటి నుంచి గంటా రాజీనామా అంశం పెండింగ్ లో ఉండగా.. తాజాగా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని మండిపడ్డారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
సీఎం జగన్ లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని గంటా ఎద్దేవా చేశారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నా. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ తన రాజీనామాను ఆమోదింపచేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. జగన్ రెడ్డికి ఆత్మ గౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం సీఎంకు ఉందా.?
అరాచక వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నా. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటా.' అని గంటా స్పష్టం చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి