హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం పలు ఆసక్తి కర విషయాలు మీడియాతో మాట్లాడారు.
ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చా. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు. మా కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును వైఎస్ఆర్ పిలిచారు. క్రిస్మస్ సందర్భంగా లోకేశ్ కు స్వీట్లు పంపాను. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు. కేటీఆర్, కవిత, హరీశ్రావుకు కూడా స్వీట్లు పంపాం.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాజకీయం అనేది మా జీవితం కాదు.. అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టం. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ కోరుకునేవారు. రాహుల్ ప్రధాని అయితేనే మతకలహాలు తగ్గుతాయి అని చెప్పారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి