విజయవాడ: రానున్న ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్షించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పాటు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు భాజపా, సీపీఎం, బీఎస్పీ, ఆప్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై విపక్ష నేతలు సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమావేశానికి ముందు చంద్రబాబు, పవన్ నోవాటెల్లో భేటీ అయ్యారు. ఈసీకి నివేదించాల్సిన అంశాలపై వీరిద్దరూ చర్చించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి