ORR: అమరావతి ఓఆర్ఆర్ కీలక అప్ డేట్! భూసేకరణ ప్రక్రియ షురూ! భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధిలో మరో కీలక మైలురాయికి నాంది పలికింది. రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభలో కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనతో బద్వేల్ – నెల్లూరు నేషనల్ హైవే (NH-67) విస్తరణ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కడప జిల్లా బద్వేల్ నుండి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు వరకు 108.13 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు రూ.3,653 కోట్లు కాగా, BOT పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గడ్కరీ ఈ విషయాన్ని స్పష్టంచేశారు.

Mini Airport: రాష్ట్రంలో మినీ విమానాశ్రయాలు! ఆ ప్రాంతాల దశ తిరిగినట్లే!

ప్రస్తుతం బద్వేల్ నుండి కృష్ణపట్నం పోర్టు దూరం 142 కిలోమీటర్లు ఉంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ హైవే పూర్తయితే దూరం 108.13 కిలోమీటర్లకు తగ్గనుంది. దీంతో కృష్ణపట్నం పోర్టుకు రవాణా సౌకర్యం మరింత వేగవంతం అవుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులు, సరకు రవాణా కోసం ఇది కీలక మార్గంగా మారనుంది. కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నం పారిశ్రామిక జోన్లకు ఈ హైవే లింక్ అవ్వడం వల్ల పరిశ్రమలకు ఆర్థిక లాభాలు కలగనున్నాయి. పోర్టుకు రవాణా సులభతరం కావడంతో వాణిజ్యం విస్తరించి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!

ఈ ప్రాజెక్ట్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవేల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.12,152 కోట్లు మంజూరైనట్లు గడ్కరీ తెలిపారు. ఈ నిధులతో 457 కిలోమీటర్ల మేర 28 పనులు చేపట్టనున్నారు. అదనంగా NHAI రూ.26,453 కోట్లతో 383 కి.మీ పొడవైన మూడు ప్రాజెక్టులు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. చెన్నై-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లలో కొత్త రహదారి ప్రాజెక్టులు వేగంగా ముందుకు వెళ్తున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కడప-రంగంపేట, కర్నూలు-కడప సెక్షన్లకు సంబంధించిన డీపీఆర్ తయారీ దశలో ఉంది.

Stree shakti: ఉచిత బస్సు ప్రయాణం కోసం అమ్మాయిల తెలివి! ఏమి చేసిందో తెలుసా! ఇదేం వాడకం తల్లో!

అదేవిధంగా, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాజెక్టుల పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో NH-167B విస్తరణకు సంబంధించిన పనులు 2021లో ప్రారంభమయ్యాయి. సింగరాయకొండ–మాలకొండ, మాలకొండ–సీఎస్‌పురం మార్గాల్లో ఇప్పటికే వందల కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.220 కోట్లకు పైగా ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పనులు పూర్తయితే స్థానిక రవాణాకు ఉపశమనం లభించడంతో పాటు, రవాణా సమయం, వ్యయం తగ్గుతుందని అధికారులు అంటున్నారు.

Bullet Train: హైదరాబాదు నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్! గంటకు 350 కిలో మీటర్ల వేగం... ఏపీలో ఆ మూడు నగరాల మీదుగా!

మొత్తం మీద, బద్వేల్–నెల్లూరు నేషనల్ హైవే విస్తరణ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ కానుంది. కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానం ద్వారా పరిశ్రమలు, వ్యాపారం, రవాణా రంగాలు విస్తృతంగా లాభపడతాయి. కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించటం, అనేక ప్రాజెక్టులు ఒకేసారి అమలు చేయడం రాష్ట్ర మౌలిక సదుపాయాలకు ఊతమివ్వనుంది. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి అయితే రాష్ట్రానికి రాబోయే దశాబ్దాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు విస్తారంగా చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

New Railway Line: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,047 కోట్లతో... రూట్ ఇదే!
Hudco Convention Center: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త మైలురాయి! ఎకరాకు రూ.4 కోట్లు.. హడ్కో కన్వెన్షన్ సెంటర్! ఎక్కడంటే?
Real Estate: చరిత్ర తిరగరాసిన రియల్ ఎస్టేట్! అక్కడ ఎకరా రూ.70 కోట్లు.. సమీప భూముల ధరలకు రెక్కలు!
Free Mobile: ఏపీలో వారందరికీ ఉచితంగా మొబైల్! వెంటనే దరఖాస్తు చేసుకోండి! 26 వరకే ఛాన్స్!