AP Exams System: ఏపీ స్కూల్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్! ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం!

టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు కూడా సందేహాస్పదంగా మారింది. 2027 ప్రపంచకప్‌లో ఆడాలన్న వారి ఆశలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ కీలక షరతు పెట్టినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నారు. వన్డే జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే, ఈ ఇద్దరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ (విజయ్ హజారే ట్రోఫీ)లో పాల్గొనాల్సిన అవసరం ఉందని సెలక్టర్లు స్పష్టం చేశారు.

Scam: వైసీపీ పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి కేసు..! దర్యాప్తు నివేదిక త్వరలో ప్రభుత్వానికి..!

మార్గదర్శక సమాచారం ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే విజయ్ హజారే టోర్నమెంట్‌లో కోహ్లీ, రోహిత్ తప్పక పాల్గొనాలి. ఈ టోర్నీలో పాల్గోనకపోతే, నేరుగా భారత జట్టులో ఎంపికకు అవకాశం తక్కువేనని వార్తలు వస్తున్నాయి. టెస్టులు, టీ20లకు దూరంగా ఉండటంతో వారి మ్యాచ్ ప్రాక్టీస్ తగ్గడం, ఫిట్‌నెస్, ఫామ్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుందని సెలక్టర్లు భావిస్తున్నారు.

P4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల మద్దతు! పేదల కోసం ఏకమవ్వాలని పిలుపు! స్వదేశం మన హృదయంలో..

ఇంకా, టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఒక ముఖ్య నిపుణుడు "2027 ప్రపంచకప్ ప్రణాళికలో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ లేరు" అని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని వారు ఆసక్తి చూపినప్పటికీ, ఎంపికకు అవకాశం లేకపోవడంతో వన్డే నుండి తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా విజయం సాధించడం, యువ ఆటగాళ్లు జట్టులో మెరుగ్గా రాణించడం నేపథ్యంలో జట్టులో కొత్త మార్పులు రాబోతున్నాయని సెలక్షణ కమిటీ భావిస్తోంది. భవిష్యత్తులో గిల్‌ను అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా నియమించాలనే ఆలోచన ఉంది.

ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!

ఈ పరిణామాలతో అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోహ్లీ, రోహిత్‌ల అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు చివరి సిరీస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో, ఈ ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌కు తిరిగి రావడం కష్టమేనని భావిస్తున్నారు. టీ20, టెస్టుల్లో జరుగుతున్న తరం మార్పిడి వన్డేల్లోనూ కొనసాగుతుండడంతో, ఈ దిగ్గజాల భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది.

Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?
Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!
Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!
Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..
NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!
AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!