అక్టోబర్ నెల అంటేనే పండగ సెలవులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. నవరాత్రి, దసరా, ఆయుధ పూజలతో దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోతారు. పండుగల కారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులు పనిచేయవు. ఈ సమయంలో ముఖ్యమైన లావాదేవీలు, నగదు ఉపసంహరణలు, ఇతర బ్యాంకింగ్ పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. పండుగల సమయంలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవటం వల్ల వినియోగదారులు ఎలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బ్యాంకు కి ఎప్పుడు సెలవులు అనే విషయాన్ని ఈ క్రింది విధంగా బ్యాంక్ అధికారులు తెలియజేశారు. అసలు ఎప్పుడో చూసేయండి మరి.
ఆంధ్రప్రదేశ్లో సెలవులు:
అక్టోబర్ 2: గాంధీ జయంతి, దసరా
ఆదివారాలు: అక్టోబర్ 5, 12, 19, 26
రెండో శనివారం: అక్టోబర్ 11
అక్టోబర్ 20: దీపావళి
ముఖ్యమైన ఇతర రాష్ట్రాల బ్యాంక్ సెలవులు:
అక్టోబర్ 1, 2025: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ – త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయలో బ్యాంకులు మూసివుంటాయి.
అక్టోబర్ 2, 2025: మహాత్మా గాంధీ జయంతి – దేశవ్యాప్తంగా జాతీయ సెలవు.
అక్టోబర్ 3, 4, 2025: సిక్కింలో దుర్గాపూజ కారణంగా బ్యాంకులు మూసివుంటాయి.
అక్టోబర్ 5, 2025: ఆదివారం – సాధారణ వారాంత సెలవు.
అక్టోబర్ 6, 2025: త్రిపుర, పశ్చిమ బెంగాల్లో లక్ష్మీ పూజ సందర్భంగా సెలవు.
అక్టోబర్ 7, 2025: కర్ణాటక, ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్లో మహర్షి వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బ్యాంకులు మూసివుంటాయి.
ఈ పండుగల సందర్భంగా బ్యాంక్ సేవలు ఆఫ్లైన్లో ఉండటం వల్ల వినియోగదారులు తమ ముఖ్యమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తిచేయడం అత్యంత అవసరం. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రం అందుబాటులో ఉంటాయని బ్యాంక్ అధికారులు తెలిపారు.