పానీ పూరి,టిఫిన్ బండ్లు అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు చాలా ఇష్టంగా తింటారు దీనికి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పానీపూరి బండ్లు,టిఫిన్ బండ్లు ఎక్కడ చూసినా మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలం వర్షాకాలం కారణంగా టిఫిన్ బండ్లు, పానీపూరి కి కొంచెం దూరంగా ఉంటే మీ ఆరోగ్యం పదిలంగా లేదా అనారోగ్య పాలవడం తథ్యం.
గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులు కఠిన చర్యలకు దిగారు. ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ముఖ్యంగా తక్షణమే కొన్ని నియమాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్ బండ్లు, పానీపూరీ వంటి వీధి ఆహార అమ్మకాలను తాత్కాలికంగా నిషేధించారు.
నగరంలోని ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంటతో పాటు మొత్తం 9 ప్రాంతాల్లో డయేరియా వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందిందని అధికారులు గుర్తించారు. వ్యాధి మరింత పెరగకుండా, త్వరగా నియంత్రించడానికి కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు రంగంలోకి దిగారు.
కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ విషయంపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత శ్రద్ధగా చేయాలని, ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డయేరియా వ్యాధి కలుషిత ఆహారం, మురికి నీరు వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ముందుగానే తత్ఫలితాలు చూపే విధంగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూత పెట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం వల్ల డయేరియా వ్యాధిని త్వరగా నియంత్రణలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజలందరూ శుభ్రతను పాటించి, సురక్షితమైన ఆహారం మరియు నీరు మాత్రమే ఉపయోగించాలన్నది అధికారులు ముఖ్యంగా సూచిస్తున్నారు.
అంతేకాక, ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య పనులను మరింత ముమ్మరం చేయడం, వీధులలో చెత్త, కాలువల లో నీరు నిలకడగా ఉండకుండా చూడటం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఈ సూచనలను పాటిస్తే, వ్యాధి మరింత పెరగకుండా ఉండగలదని అధికారులు ఆశిస్తున్నారు అలానే ప్రజలు కూడా అవగాహన పెంచుకొని చుట్టుపక్క వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుపుతున్నారు.