LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Middle East Crisis 2026: ఇరాన్ క్షిపణి దాడి..ఖతార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ ధ్వంసం!

Middle East Crisis 2026: ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ భీకర క్షిపణి దాడి చేసింది. ఈ దాడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనివల్ల భారత్ వంటి దేశాలపై పడే ప్రభావం ఏంటి?

AndhraPravasi News Desk 2 min read
Middle East Crisis 2026: ఇరాన్ క్షిపణి దాడి..ఖతార్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ ధ్వంసం!

Middle East Crisis 2026: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో నడుస్తున్న సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఖతార్‌లోని ప్రఖ్యాత 'రాస్ లఫాన్' ఇండస్ట్రియల్ సిటీని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది. ఇందులో నాలుగు క్షిపణులను ఖతార్ రక్షణ వ్యవస్థలు గాలిలోనే అడ్డుకోగలిగినప్పటికీ, ఒక క్షిపణి మాత్రం నేరుగా గ్యాస్ ప్లాంట్‌ను తాకడంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది కేవలం ఒక ప్లాంట్‌పై జరిగిన దాడి మాత్రమే కాదు, ప్రపంచ గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసే చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆకాశాన్ని తాకిన చమురు ధరలు

ఈ దాడి ప్రభావం వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్‌పై కనిపించింది. గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం కలగడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 8 శాతం పెరిగి, బ్యారెల్‌కు 111.90 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే గ్యాస్‌లో దాదాపు 20 శాతాన్ని ఈ ఒక్క ప్లాంటే అందిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీకార చర్యలతో దడ పుట్టిస్తున్న ఇరాన్

ఇటీవల ఇరాన్‌కు చెందిన 'సౌత్ పార్స్' గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించిన ఇరాన్, ఇప్పుడు ఖతార్‌తో పాటు అబుదాబీలోని గ్యాస్ కేంద్రాలను కూడా టార్గెట్ చేసింది. అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్ దేశాల ఇంధన వనరులను దెబ్బకొట్టడం ద్వారా ఆ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేది ఇరాన్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. కేవలం ఖతార్‌కే పరిమితం కాకుండా సౌదీ అరేబియాలో కూడా ఇరాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

భారత్ లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం

ఈ క్షిపణి దాడి వల్ల మన దేశంపై కూడా పరోక్షంగా భారం పడనుంది. భారత్ తన గ్యాస్ అవసరాల కోసం ఖతార్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఇప్పుడు రాస్ లఫాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి పునరుద్ధరణకు ఈ ఏడాది మధ్య కాలం వరకు సమయం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల భారత్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పుడు ఇతర మార్గాల ద్వారా గ్యాస్‌ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది రవాణా ఖర్చులను పెంచి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే ప్రమాదం ఉంది.

అప్రమత్తమైన గల్ఫ్ దేశాలు

ప్రస్తుతానికి ఖతార్ ఎనర్జీ సంస్థ తమ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ప్రకటించినప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ట్యాంకర్ల రాకపోకలు ఇప్పటికే నిలిచిపోవడంతో గల్ఫ్ రీజియన్‌లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ దాడికి ప్రతిగా అమెరికా తన తదుపరి అడుగు ఎలా వేస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…