ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతీయ రైల్వే(Indian Railways) కీలక ప్రణాళికలు అమలు చేయబోతోంది. ఏకంగా 2 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వీటి ద్వారా రైల్వే ప్రయాణ వ్యవస్థను మరింత అప్ డేట్ చేయబోతోంది. ఈ రైళ్ల రాకతో ప్రయాణీకులందరికీ కన్ఫర్మ్ బెర్త్ లు లభించనున్నాయి. అత్యంత సవాలుగా మారిన వెయిట్ లిస్ట్(Wait list) టికెట్లను సమస్యను పూర్తి తొలగిపోనుంది. ఇరాన్ అణు యుద్ధం షురూ..? రైల్వే తాజా ప్రణాళిక ప్రకారం ప్రతి ఏటా 1,000 కోట్ల మందికి మెరుగైన ప్రయాణ వసతిని కల్పించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
ప్రస్తుత వార్షిక సంఖ్య 800 కోట్లు ఉండగా, గణనీయమైన స్థాయిలో పెరుగుదల కనిపించనుంది. రిజర్వ్ కేటగిరీలలో అందుబాటులో ఉన్న బెర్త్ కొరత కారణంగా ఏర్పడిన 5 కోట్ల మంది వెయిట్ లిస్ట్(Wait list) చేయబడిన ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయనుంది. అదనపు రైళ్లను ప్రవేశపెట్టడంతో ప్రతి ప్రయాణికుడికి ధృవీకరించబడిన టికెట్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే. ప్రస్తుతం భారతీయ రైల్వే రోజుకు సుమారు 10,748 ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది. మరో 2,000 రైళ్లను చేర్చడం ద్వారా రిజర్వ్ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: Palnadu Incident: పల్నాడులో పట్టపగలే దారుణం.. రోడ్డు పక్కన మంటల్లో మృతదేహం!
అందుబాటులో ఉన్న రైళ్ల సంఖ్యను పెంచడం ద్వారా, ప్రయాణీకులకు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలని, రిజర్వ్ సీటు లేకుండా ఎవరూ ఉండకూడదని రైల్వే సంస్థ భావిస్తోంది. భారతీయ రైల్వే వేగవంతమైన, ఇంధనాన్ని ఆదా చేస్తూ, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన 450 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. దీనితో పాటు, సమర్థవంతమైన, హై-స్పీడ్ సేవలను అందించడానికి రూపొందించబడిన 200 పుష్ పుల్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. రైల్వే నెట్ వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ కొత్త రైళ్లు మెయిల్, ఎక్స్ ప్రెస్ సేవల పెరుగుదలతో అనుబంధంగా ఉంటాయి. పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా లైన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు అధికారులు. రైళ్లు సజావుగా, వేగవంతమైన ప్రయాణాలు కొనసాగించేలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROB)లు, రైల్ అండర్ బ్రిడ్జిలు (ROB)లు నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hero Politics: ఫేమ్ చూసి రాజకీయాల్లోకి రాలేమన్న హీరో! సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం..
ఈ విధానంతో వెయిట్ లిస్ట్ చేయబడిన టికెట్ల జారీని పరిమితం చేస్తారు. కొత్త నియమం వెయిట్ లిస్ట్ చేయబడిన టికెట్ల జారీని కోచ్ మొత్తం సీటింగ్ సామర్థ్యంలో 25 శాతానికి పరిమితం చేస్తుంది. ఈ చర్య మరింత పారదర్శకంగా, న్యాయంగా ఉండే టికెటింగ్ వ్యవస్థను తయారు చేసేందుకు రూపొందించబడింది. గతంలో, పీక్ సీజన్లలో, స్లీపర్ క్లాస్ లో వెయిట్ లిస్ట్లు తరచుగా 300 మంది ప్రయాణికులకు మించి, AC కోచ్లలో 150 కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు మించి ఉండేవి. వెయిట్ లిస్ట్ను 25% వద్ద క్యాప్ చేయడం ద్వారా, అందరికీ కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం రిజర్వేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. ప్రయాణీకులు ధృవీకరించబడిన బెర్త్ను పొందే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: