Auto Driver's: ఏపీలో ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక! ఆర్థిక సాయం + 2.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్..!

రేషన్ కార్డు దారులకు కీలక గడువు
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి ప్రభుత్వం స్పష్టమైన గడువు పెట్టింది. సెప్టెంబర్ 25లోపు తమ కార్డు వివరాలను అప్‌డేట్ చేయకపోతే, వచ్చే నెల అక్టోబర్‌లో బియ్యం అందదు. అంటే కార్డు ఉన్నా.. అప్‌డేట్ చేయకపోతే రేషన్ ఇవ్వరన్న మాట. ఈ నియమం రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుదారులందరికీ వర్తిస్తుంది.

BSNL Freedom Offer: BSNL ఫ్రీడమ్ ఆఫర్! కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. డైలీ 2GB డేటా!

అప్‌డేట్ ఆలస్యమైతే సమస్యలు
ఇప్పటికే సూర్యాపేటలో ఒక మహిళకు కార్డు వచ్చినా అప్‌డేట్ జరగకపోవడంతో రేషన్ అందకపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అధికారులు స్పందించి ఆగస్టు 25లోపు అప్‌డేట్ చేసిన వారికి మాత్రమే సెప్టెంబర్‌లో రేషన్ ఇచ్చామని, ఇకపై అక్టోబర్ సరఫరా కావాలంటే తప్పనిసరిగా సెప్టెంబర్ 25లోపు అప్‌డేట్ పూర్తి చేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఏఎస్‌వో స్థాయిలో జరుగుతుంది.

హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్! రోజుకి రెండు స్పూన్లు.. ఎప్పుడు తినాలంటే!

ప్రభుత్వ ప్రణాళికలు, సాంకేతిక ఇబ్బందులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల మంజూరు వేగం పెరిగింది. జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చినా, కొత్త కార్డులు పొందిన వారిలో కొందరికి మాత్రమే లభించాయి. జూలై–ఆగస్టులో దరఖాస్తు చేసినవారికి సెప్టెంబర్ నుండి బియ్యం అందించాలని అధికారులు ప్రణాళిక చేసినా.. సాంకేతిక సమస్యల కారణంగా అప్‌డేట్ జరగకపోవడంతో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

GST: పెట్రోల్-డీజిల్ పై జీఎస్టీ! కేంద్రం వాయిదా..!

ఈ-కేవైసీ తప్పనిసరి
ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక కీలక సూచన చేసింది. కొత్త కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులందరిని సమీప రేషన్ దుకాణానికి తీసుకెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయించాలి. ఆధార్ అనుసంధానం వల్ల బినామీలకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. గడువులు పొడిగించినా ఇంకా చాలా మంది కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్డులు రద్దు అయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

SSEPL Plant: దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏపీలోనే..! అక్కడే ఫిక్స్, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
Hundreds Nails : రోడ్డుపై వందలకొద్దీ మేకులు.. వాహనదారుల్లో భయాందోళనలు!
Madhav: కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది.. మాధవ్!
Electric Scooter offer: ఈవీ మార్కెట్‌లో సంచలనం.. రూ.28,499కే సొంతం చేసుకోండి! రూ.10కే 100కిమీ వెళ్లొచ్చు!
అమెరికాలో ఇమిగ్రేషన్ రైడ్‌! వందలాది కొరియన్ల అరెస్ట్‌! అసలు కారణం ఇదే!
Central Railway: సెంట్రల్ రైల్వేలో 2418 అప్రెంటీస్ పోస్టులు.. రేపే చివరి తేదీ!