ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..
Sat May 17, 2025 06:58 Politics
రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలతో సమీక్షలో పొగాకు సాగు నియంత్రణ, కోకోకు ప్రత్యేక విధానం, మిర్చిలో నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని, పొగాకును కంపెనీలు కొనాలని సూచించారు. క్వింటాల్కు రూ.12,500 చెల్లించాలని, కోకో గింజలను కిలోకు రూ.500 తగ్గకుండా కొనాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పొగాకు సాగును నియంత్రించాలని, కోకోకు ప్రత్యేక విధానం తీసుకురావాలని, మిరపలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతుల దగ్గర ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని.. రైతుల దగ్గర మిగిలిపోయిన పొగాకును కంపెనీలు కొనాలని సూచించారు. రైతులకు క్వింటాల్కు రూ.12,500 ధర చెల్లించాలని ఆదేశించారు. అలాగే కోకో గింజలను కిలోకు రూ.500 తగ్గకుండా కొనుగోలు చేయాలని, నష్టపోయిన మిర్చి రైతుల జాబితా తయారు చేయాలని, సన్న రకాలు పండించేలా వరి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఊరుకునేది లేదని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోకోను కిలోకు రూ.500 తగ్గకుండా కొనుగోలుచేయాలని.. కోకో కొనుగోళ్ల కోసం త్వరలో ఆయిల్పామ్ తరహా విధానం తీసుకురానున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తక్కువ ధరకు మిర్చి అమ్మి నష్టపోయిన రైతుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. వరి రైతులను సన్న రకాలు పండించేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతుల దగ్గర ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఖరీఫ్ నుంచి సన్న రకాలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు తక్కువగా జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. రబీలో 1,41,414 మంది రైతుల నుంచి 17.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.3,258 కోట్లు జమ చేశామని చెప్పారు.. గత ప్రభుత్వంలో తక్కువ ధాన్యం కొన్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్! మరో ఇద్దరు అరెస్ట్!
బర్లీ పొగాకును క్వింటాల్కు రూ.12,500 చొప్పున కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రైతుల ఇళ్ల దగ్గర, పొలాల దగ్గర ఎక్కడా నిల్వలు ఉండకూడదని అన్నారు. జీపీఐ, ఐటీసీ సంస్థలు వెంటనే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. రైతులను దోపిడీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తక్కువ ధరకు మిరప అమ్మి నష్టపోయిన రైతుల పేర్లను మార్కెట్ యార్డుల నుంచి సేకరించాలని కోరారు. పొగాకు కొనుగోలులో ఆలస్యం జరుగుతున్నందుకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పరిశ్రమలతో స్నేహంగా ఉంటానని.. కానీ రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.
ధరలు పతనం కాకుండా చర్యలు తీసుకోవడంలో పొగాకు బోర్డు విఫలమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధిక ధరలు ఆశ చూపి రైతులతో పొగాకు సాగు చేయిస్తున్న కంపెనీలు, పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిస్తున్నాయన్నారు. మిరప, మొక్కజొన్న, పత్తిలో నష్టాల కారణంగా రైతులు పొగాకు సాగు వైపు మొగ్గు చూపుతున్నారని.. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో సాగు ఎక్కువగా ఉందన్నారు. ఇక వచ్చే పంటకాలంలో బర్లీ పొగాకు సాగును నియంత్రించాలని ఆదేశించారు. జూన్ నుంచి సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పొగాకు నుంచి ఇతర పంటలకు మారేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మార్కెట్ కమిటీల్లో మిరప విక్రయించిన రైతుల పేర్లతో జాబితా సిద్ధం చేయాలని.. అందులో దళారుల పేర్లను తొలగించాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు మిరపలో పురుగుమందుల వినియోగం తగ్గించి.. ఎగుమతులకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు! ఆ 26 జిల్లాల్లో వారికి ఇక పండగే.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #ChandrababuNaidu #GoodNews #APGovernment #WelfareScheme
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.