అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద దారుణ రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఓదెయ్యటంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో హంద్రీనీవా ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రమ (50) అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ సమావేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే రాయచోటిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన సమాచారం తెలుసుకున్న కలెక్టర్ శ్రీధర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి గాయపడినవారిని పరామర్శించారు. డిప్యూటీ కలెక్టర్ రమ మృతిపట్ల అధికార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రజాసేవలో ఉన్న అధికారిణి ఇటువంటి దుర్ఘటనకు గురయ్యారని చెబుతూ, రమాదేవి కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్కు ఊహించని షాక్! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!
వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్పోర్టులో పట్టివేత!
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్లోనే దాడి!
మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?
కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు నమోదు! వైసీపీ గుండెల్లో గుబులు..
సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!
ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!
ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: