ప్రముఖ అమెరికా ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారతీయ యువతకు, ముఖ్యంగా ఫ్రెషర్లకు శుభవార్తను అందించింది. ప్రస్తుత సంవత్సరంలో సుమారు 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్లో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో కాగ్నిజెంట్ ఒకటి. కంపెనీ వృద్ధి ప్రణాళికలు, ఆవిష్కరణలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ భారీ నియామకాలకు సిద్ధమైనట్లు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్. ఎస్ తెలిపారు. "మా వ్యూహంలో భాగంగా ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ టాలెంట్ పిరమిడ్ను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతోనే ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను తీసుకోవాలనుకుంటున్నట్లు రవి కుమార్ వివరించారు.
ఇది కూడా చదవండి: ఆ సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు.. నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా.! సూపర్ స్టార్ ఆందోళన..
ముఖ్యంగా గత రెండేళ్లుగా మేనేజ్డ్ సర్వీసులకు సంబంధించిన ప్రాజెక్టులు పెరిగిన నేపథ్యంలో, అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో వేగం పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్లో 3,36,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత త్రైమాసికంలో నియామకాలు కొంత నెమ్మదించినప్పటికీ, తాజాగా ఫ్రెషర్ల నియామకం, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ఉత్పాదకత పెంపుదల, మానవ వనరుల వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించడం అనే మూడు కీలక అంశాలపై కంపెనీ దృష్టి సారించినట్లు సీఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలో కాగ్నిజెంట్లో పనిచేసి మానేసిన వారిలో సుమారు 14,000 మంది ఇప్పటికే తిరిగి సంస్థలో చేరారని, మరో 10,000 మంది త్వరలో చేరనున్నారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!
మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: