ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్లోనే, భూసేకరణకు రెడీ!
Mon Jun 02, 2025 09:04 Others.202506027875.jpg)
ఆంధ్రప్రదేశ్ గుండా బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. చెన్నై నుండి మైసూరు వరకు 463 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్ల మేర పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా రైలు మార్గం వెళ్లనుంది. పలమనేరు దగ్గర ఒక స్టాపింగ్ ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు 41 గ్రామాల పరిధిలో భూసేకరణ పనులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మీదుగా బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. మైసూరు వరకు బుల్లెట్ ట్రైన్తో పాటుగా చెన్నై నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ వే రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఆదేశాలతో సర్వే, భూసేకరణ పనులు మొదలయ్యాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ కూడా చేస్తున్నారు. కేంద్రం చెన్నై-మైసూరు మధ్య బుల్లెట్ రైలు 463 కి.మీ దూరం ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో 77 కిలోమీటర్ల మేర పలమనేరు, బంగారుపాళ్యం మీదుగా వెళ్తుంది. ఈ రైలు మార్గంలో మొత్తం తొమ్మిది స్టాపింగ్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.. అందులో పలమనేరు మండలంలోని 190-రామాపురం దగ్గర ఒక స్టాపింగ్ ఉంటుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అమరావతి రైతులకు గుడ్ న్యూస్-రెండో విడత భూసేకరణ! ఫ్లాట్లు ఇలా..!
ఈ మేరకు ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి NHSRCL జీఎం నిషాంత్ సింఘాల్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అధికారులు 41 గ్రామాల పరిధిలో భూమిని సేకరిస్తున్నారు. దాదాపు 876 మంది రైతుల నుండి భూమిని సేకరించే పనిలో ఉన్నారు. దీని కోసం ఇప్పటికే సర్వే చేసి ఆయా భూముల్లో రాళ్లు కూడా పాతుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జల్లిపేట, కూర్మాయి, మొరం, కొలమాసనపల్లె, పలమనేరు, పెంగరగుంట, సముద్రపల్లె వంటి ఊర్లలో భూసేకరణ చేస్తున్నారు. బైరెడ్డిపల్లె మండలంలో కంభంపల్లె, శెట్టిపల్లె, బేలుపల్లె, ఆళ్లపల్లె, లక్కనపల్లె ఊర్లలోకూడా భూసేకరణ, లైన్ అలైన్మెంట్ పనులు చేపట్టారు. ఈ మేరకు ప్రాజెక్ట్ కోసం సర్వే, భూసేకరణ మొదలుపెట్టారని చెబుతున్నారు అధికారులు.
కేంద్రం దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్లను నడపాలని ప్లాన్ చేస్తోంది.. ఈ మేరకు ఆయా రూట్లలో సర్వేలు కూడా చేయించింది.. ప్రస్తుతం భూ సేకరణ పనులు మొదలయ్యాయని చెబుతున్నారు. ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు నడిచే బుల్లెట్ రైలు పనులు వేగవంతం చేశారు. ఈ మేరకు బుల్లెట్ రైలు దూసుకెళ్లే 300 కిలోమీటర్ల వయాడక్ట్ (రైల్వే బ్రిడ్జి) పనులు పూర్తయ్యాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ. 4లక్షలు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!
పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?
ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!
కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్కు అప్గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #BulletTrain #ChennaiToMysuru #HighSpeedRail #NHSRCL #AndhraPradeshDevelopment #PalamanerStop #ChittoorDistrict #LandAcquisition
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.