Education Minister: నీట్ పేపర్ లీక్ వివాదం ప్రభావం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?
Education Minister: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఘటన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు, పలు సామాజిక సంఘాలు వ్యక్తం చేసిన ఆందోళనల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.
నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?..
నీట్ లీక్ వివాదం రాజకీయ మలుపు.. ధర్మేంద్ర ప్రధాన్ వైదొలిగినట్లు ప్రచారం..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పేపర్ లీక్ ఘటన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు, పలు సామాజిక సంఘాలు వ్యక్తం చేసిన ఆందోళనల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను తమ తొలి డిమాండ్గా ప్రకటించింది. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తూ నిరసనలను కొనసాగించారు.
సీజేపీ విధించిన గడువు ముగియకముందే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా సమర్పించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరో విడత చర్చలు జరగాల్సిన సమయంలోనే ఆయన పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. పరీక్షల విశ్వసనీయత, భవిష్యత్పై ప్రభావం, పరీక్షల నిర్వహణలో లోపాలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరీక్షా వ్యవస్థలో సంస్కరణల దిశగా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంపు, ప్రశ్నపత్రాల భద్రత, బాధ్యులపై కఠిన చర్యలు వంటి అంశాలపై మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Tags
Be the first to react