అస్వస్థతతో అమిత్ షా.. కార్యక్రమానికి బ్రేక్.

హుబ్బళ్లి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనారోగ్య కారణాలతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. శనివారం కేఎల్ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ మెడికల్ కాలేజీ నూతన భవనం, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.

Amit Shah Hubballi Event
Amit Shah Hubballi Event
  • హుబ్బళ్లిలో జరగాల్సిన మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అమిత్ షా హాజరు కావాల్సి ఉంది.
  • 1,200 పడకల ఆసుపత్రి, మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.

హుబ్బళ్లి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనారోగ్య కారణాలతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. శనివారం కేఎల్ఈ జగద్గురు గంగాధర్ మహాస్వామిగళు మూరుసావిరమఠ్ మెడికల్ కాలేజీ నూతన భవనం, 1,200 పడకల కేఎల్ఈ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.

శుక్రవారం అర్ధరాత్రి హుబ్బళ్లికి చేరుకున్న అమిత్ షా.. అక్కడి హోటల్లో బస చేశారు. అయితే శనివారం ఆరోగ్యంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యుల సూచన మేరకు హోటల్లోనే విశ్రాంతి తీసుకున్నారు. కేఎల్ఈ సొసైటీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోరే ఈ విషయాన్ని కార్యక్రమ వేదికపై వెల్లడించారు.

అమిత్ షా లేకుండానే ప్రారంభోత్సవం

అమిత్ షా గైర్హాజరైన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు ఇతర ప్రముఖులు మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని ప్రారంభించారు.

1,200 పడకల ఆసుపత్రి

హుబ్బళ్లిలోని గబ్బూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య సముదాయం ఉత్తర కర్ణాటకలో వైద్య విద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులలో కీలక ప్రాజెక్టుగా రూపొందింది. ఇందులో కొత్త మెడికల్ కాలేజీ భవనంతో పాటు 1,200 పడకల ఆసుపత్రి, మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఉన్నాయి.

ప్రభాకర్ కోరే మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యల కారణంగా హోటల్లోనే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం

Tags

Be the first to react

Latest